Sukumar : గురు శిష్యులని కలిపిన ఎన్టీఆర్… సుకుమార్ కి డైరెక్టర్ బుచ్చిబాబు సాయం…

Sukumar : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘ పుష్ప ‘.ఈ మూవీకి రోజురోజుకీ క్రేజ్ పెరుగుతుంది. పుష్ప-2 కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప-2 పై ఇప్పుడు అంచనాలు మామూలుగా లేవు. ఈ అంచనాలన్నీ మ్యాచ్ అయ్యేలా సుకుమార్ ‘ పుష్ప ది రూల్ ‘ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. స్క్రిప్ట్ వర్క్ వలన షూటింగ్ ఆలస్యం అవుతుంది. సుకుమార్ ఈ సినిమా షూటింగ్ను సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని అనుకుంటున్నారు. దీంతో తన అసిస్టెంట్ డైరెక్టర్స్, రైటింగ్ టీం తో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

పుష్ప ది రూల్ స్క్రిప్ట్ వర్క్ కోసం ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తన గురువుతో చేతులు కలిపారు. ఈమధ్యనే బుచ్చిబాబు ‘ పుష్ప-2’ స్క్రిప్ట్ వర్క్ లో జాయిన్ అయ్యారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. గతంలో బుచ్చిబాబు ‘ రంగస్థలం ‘ సినిమా కోసం సుకుమార్ తో కలిసి స్క్రిప్ట్ వర్క్ లో పని చేశారు. ‘ రంగస్థలం ‘ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మళ్లీ బుచ్చిబాబు తన గురువు అయిన సుకుమార్ తో చేతులు కలపడంతో బెస్ట్ స్క్రిప్ట్ తయారవడం ఖాయం. బుచ్చిబాబు తన గురువుకి సాయం చేయడానికి ఒక రకంగా ఎన్టీఆర్ నే కారణం అని చెప్పాలి. ఎందుకంటే బుచ్చిబాబు ఉప్పెన తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పారు.

Sukumar :సుకుమార్ కి డైరెక్టర్ బుచ్చిబాబు సాయం…

buchibabu helped to sukumar in puspa movie makeing
buchibabu helped to sukumar in puspa movie makeing

ఇంతలో కొరటాల శివతో ఎన్టీఆర్ తో సినిమా ప్రకటించారు. దీనితో బుచ్చిబాబు వరికొంత కాలం ఎదురు చూడాలి లేదా కొత్త సినిమా చేసుకోవాలి. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు కాబట్టి సుకుమార్ బుచ్చిబాబుని ‘ పుష్ప ది రూల్ ‘ స్క్రిప్ట్ వర్క్ కోసం పిలిచారట. అలా ఎన్టీఆర్ పరోక్షంగా మరోసారి గురు శిష్యులను కలిపారు. సుకుమార్ పుష్ప-2 కథపై తన అసిస్టెన్స్ అందరితో చర్చలు జరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ ఫోటోలో బుచ్చిబాబు సుకుమార్ కి సలహాలు ఇస్తున్నారు. పుష్ప-2 కోసం సుకుమార్ ఏ రేంజ్ లో మైండ్ బ్లాక్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకి 350 కోట్లు బడ్జెట్ గా మైత్రి మూవీస్ నిర్మాతలు ఫిక్స్ చేసినట్లు సమాచారం