Business ideas black rice farming
Business Ideas : ఈ రోజుల్లో చాలామంది సొంత వ్యాపారం చేయాలనుకుంటున్నారు. ఒకరి కింద పనిచేసే బదులు మనమే సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చు అనుకుంటారు. కరోనా వచ్చాక చాలామంది తమ ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు. అలాంటి వాళ్ళలో కొంతమంది ఏదో ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండిపోయారు. మరికొందరు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. సాంప్రదాయ పంటలు కాకుండా వాణిజ్య పంటలను పండిస్తూ లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. ఈరోజుల్లో బ్లాక్ రైస్ కు డిమాండ్ బాగా పెరుగుతుంది.
మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది. ఈ పంటను పండిస్తే మీకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది.మనం ప్రతిరోజు తినే సాధారణ బియ్యం తో పోల్చితే నల్లబియ్యం లో పోషకాలు అధికంగా ఉంటాయి. అలాగే ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ బ్లాక్ రైస్ ను తినడం వలన డయాబెటిస్, బిపి వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తుంది అని వైద్యులు తెలిపారు. ఈ బియ్యం తింటే షుగర్, బీపీ రోగాలు నియంత్రణలో ఉంటాయి. అందుకే కాస్త ధర ఎక్కువ అయిన చాలామంది బ్లాక్ రైస్ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మొదటిగా ఈ పంటను ఎక్కువగా చైనా వాళ్లు పండించేవారు. ఈ బ్లాక్ రైస్ వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉండటం వలన ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. మన దేశంలో నల్ల బియ్యం సాగు ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, మణిపూర్, అస్సోమ్ లో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూడా కొందరు రైతులు బ్లాక్ రైస్ ను పండిస్తున్నారు. ఇవి బియ్యం గా ఉన్నప్పుడు నల్లగా కనిపిస్తాయి.
వండిన తర్వాత అన్నం నీలం, ఊదా రంగులోకి మారుతుంది. అందుకే ఉత్తర భారత దేశం వాళ్ళు దీనిని నిలాభట్ అనికూడా పిలుస్తారు. నల్ల బియ్యం పంట కాలం దాదాపు నాలుగు నెలలు ఉంటుంది. వరి నారు పోసినప్పటినుంచి ,పంట చేతికి వచ్చేందుకు సుమారుగా 100- 120 రోజులు పడుతుంది. సాధారణ వరి మొక్క కంటే నల్ల వరి మొక్కలు కాస్త పొడవుగా ఉంటాయి. వరి కంకులు కూడా పెద్దవిగా ఉంటాయి. మన సాంప్రదాయ బియ్యం కంటే నల్ల బియ్యంతో ఐదు రెట్లు అధిక ఆదాయం పొందవచ్చు.
సాధారణ బియ్యం ధర మార్కెట్లో కిలోకు రూ. 50-100 వరకు ఉంటుంది. అదే నల్ల బియ్యం అయితే మార్కెట్లో రూ.250- 500 వరకు ఉంటుంది. నాణ్యతను బట్టి రేటు ఉంటుంది. సేంద్రియ పద్ధతిలో నల్లవరి పంటను సాగు చేస్తే రేటు ఎక్కువ వస్తుంది. SMAM యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ పథకం కింద 50 నుంచి 80% సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు, యంత్రాలను పొందవచ్చు.
మీరు బ్లాక్ రైస్ ను పండించి మీరే ప్రాసెస్ చేసి మార్కెట్లో అమ్మితే లక్షల ఆదాయం వస్తుంది. నల్ల బియ్యం తినడం వలన గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి రోగాలు రావని వైద్యశాస్త్రం తెలిపింది. ఈ బ్లాక్ రైస్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే 10 గ్రాముల బ్లాక్ రైస్ నుంచి తొమ్మిది గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అలాగే దీనిలో ఫైబర్, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్, బిపి రోగులకు ఎంతో మేలు చేస్తుంది. అందుచేతనే మార్కెట్లో ఈ బ్లాక్ రైస్ కు బాగా గిరాకీ ఉంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…