Guppedanta Manasu 26 October today full Episode
Guppedanta Manasu 26 October Episode : చిన్నితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 591 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… గౌతమ్ ఇంట్లో కూర్చొని రిషి మహేంద్ర వాళ్ల గురించి టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటాడు. రిషిని అలా చూస్తూ మహేంద్ర కూడా ఎంతో బాధపడుతూ ఉంటాడు. అయినా డాడీ నామీద అలిగాడు అంతే తను నాకు కనిపించగానే నేను కౌగిలించుకొని సారీ చెప్తే వెంటనే కోపం అంతా పోతుంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర జగతితో నేను ఒక రాక్షసుడుని రిషి నీ బాధ పెడుతున్నాను అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు వసుధారా గౌతమ్ ని గౌతమ్ సార్ మీరు ఎందుకు అంత టెన్షన్ పడతానన్నారు అలా ఎందుకు ఉన్నారు అని అడుగుతుంది.
అప్పుడు గౌతం ఏం లేదు మీరు కూడా టెన్షన్ పడుతున్నారు కదా అందుకే నేను బాధపడుతూ టెన్షన్ పడుతున్నాను నాకు టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది అని చెప్తాడు గౌతమ్. అప్పుడు రిషి డాడ్ వాళ్లు నాకెందుకు దగ్గరగా ఉన్నారు అని నా మనసుకి అనిపిస్తుంది. అంటూ డాడ్ లేకుండా నేను ఎలా ఉండాలి రా గౌతం డాడ్ వాళ్లు ఎక్కడ ఉంటున్నారు ఏం తింటున్నారు అని బాధపడుతూ ఉంటాడు. ఇక గౌతం రీషిని ఓదార్చుతూ ఉంటాడు. అప్పుడు రిషి వసుధారాలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మహేంద్ర వాళ్ళు బయటికి వచ్చి బాధపడుతూ ఉండగా.. గౌతం నాకు ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది మీ సమస్యలన్నీ క్లియర్ అయిన తర్వాత రిషి కి నేను మిమ్మల్ని ఇక్కడ దాచాను అన్న విషయం తెలిస్తే ఆ పరిస్థితి ఏంటో నేను ఇప్పుడు చూశాను అని అంటూ ఉంటాడు. అప్పుడు జగతి అవును మహేంద్ర గౌతమ్ నీ ఇబ్బంది పెడుతున్నాం.
అయినా ఋషి ఎంత బాధ పడుతున్నాడో నువ్వు చూస్తున్నావు కదా నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపో తన మనసుని బాధ పెట్టకు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర మనం ఒక సమస్యకి పరిష్కారం కోసం ఇద్దరం కలిసి బయట అడుగుపెట్టాం ఆ సమస్యకి పరిష్కారం దొరికే వరకు ఎంత బాధనైనా అనుభవించాలి జగతి అని అంటూ ఉంటాడు. అప్పుడు జగతి తనని అన్ని రోజులు ఇలాగే బాధ పెడతావా మహేంద్ర అని అంటూ ఉంటుంది. తప్పదు జగతి అని మహేంద్ర అంటాడు. ఇక గౌతం వెళ్ళిపోతూ ఉండగా.. మహేంద్ర ఒక్కసారిగా గౌతమ్ ని కౌగిలించుకొని ఏడుస్తూ ఈ కౌగిలింతని నా తరఫున రిషికి ఇవ్వు అని బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే రిషి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండగా.. వసుధర అక్కడికి వచ్చి తన కూర్చున్న చైర్ నీ అలాగే చూస్తూ ఉండగా.. రిషి లోపలికి రా అని చెప్పగానే.. ఈ చైరంటే నాకు చాలా ఇష్టం అని అనగానే రిషి లేసి వసుధారని కూర్చోబెట్టబోతు ఉండగా.. వసుధార కాలిపై చైరు పడుతుంది.
అప్పుడు రిషి అయ్యో నొప్పిగా ఉందా వసుదారా అని బాధపడుతూ ఉండగా.. వసుధార నాకేం కాలేదు మీరు రిలాక్స్ అవ్వండి అని కూర్చోబెట్టుతుంది. అప్పుడు రిషి మహేంద్ర వాళ్ల గురించి బాధపడుతూ మనం ఇలా సంతోషంగా ఉండాలి అని డాడ్ వాళ్లు వెళ్లిపోయారు అనుకుంటా అని అంటాడు. అప్పుడు వసుదార మనం కలవడానికి వాళ్లు వెళ్లిపోతారా అని అంటుంది. అప్పుడు ఋషి ఏమో అయ్యుండొచ్చు అని అంటూ వాళ్ళేం తింటున్నారో ఎలా ఉంటున్నారు అని బాధపడుతూ వసుధర నువ్వేమైనా తిన్నావా నీకు ఆకలిగా లేదా అని అంటాడు. అప్పుడు వసుధార ఆకలి ఫుల్ గా ఉంది కానీ మీరు తినకపోతే నేను ఎలా తింటాను అని అంటుంది. అప్పుడు రిషి నువ్వు వెళ్లి తిను అని చెప్పగానే వసుధార నేను వంట చేస్తాను మీరు రెడీగా ఉండండి అని చెప్పి వసుదారా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అంతలో గౌతం అక్కడికి వచ్చి ధరణిని ఇంట్లో ఏంటి అంత సైలెంట్ గా ఉంది అందరూ ఎక్కడికి వెళ్లారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ధరణి అందరూ ఉన్నారు ఉదయం నుంచి ఎవరు ఏమి తినలేదు.. ఎవరు రూమ్ లో వాళ్ళు ఉన్నారు అని చెప్తూ ఉంటుంది.
అంతలో రిషి అక్కడికి వచ్చి గౌతమ్ ని డాడీ వాళ్లు కనిపించారా నువ్వు వెతికావా లేదా మనిద్దరం వెళ్దాం పద అని అంటూ ఉండగా.. గౌతం టెన్షన్ పడకురా వాళ్ళు వస్తారులే కానీ ఎవరూ ఏమీ తినలేదంట ఏంటి నువ్వు తినకపోతే అందరూ తినరు కదా తెలుసు కదా పెద్దమ్మ కూడా ఏమి తినకపోతే ఎలా పెద్దమని పిలుచుకొని రా పోరా అని చెప్తూ ఉంటాడు. అప్పుడు రిషి వెళ్తుండగా.. గౌతం రిషి ని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు రిషి ఏమైందిరా అని అడగగానే.. ఏం లేదులే అంకుల్ వాళ్లు వస్తారులే నువ్వు టెన్షన్ పడకు అని చెప్తాడు. ఇక రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే దేవయాని రిషితో పోలీస్ కంప్లైంట్ ఇవ్వకు అని మీ పెదనాన్న చెప్పాడు అని అంటూ జగతిని తిడుతూ ఉంటుంది. అప్పుడు రిషి నువ్వు అలా అనకు పెద్దమ్మ తప్పంతా నాదే అయ్యుంటుంది వాళ్ళది ఏమి తప్పులేదు నేను కొడుకు అవ్వకముందు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని అంటూ దేవయాని షాక్ అయ్యేలా మాట్లాడుతూ ఉంటాడు.
అప్పుడు రిషి మాటలు వింటున్న దేవయాని షాక్ అవుతూ ఉంటుంది. వసుధారాణి నువ్వు ఇక వెళ్ళొచ్చు కదా అని అనగానే రిషి తను ఇక్కడే ఉంటుంది అని చెప్తాడు. కట్ చేస్తే రిషి వసుదారాలు ఒక దగ్గర కూర్చొని జగతి మహేంద్ర వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉండగా.. మినిస్టర్ పిఏ ఫోన్ చేస్తాడు. అప్పుడు రిషి ఆ ఫోన్ గురించి వసుధారా కి చెప్తాడు. అప్పుడు వసుధరా మనం బాధపడుతున్నామని వాళ్ళకి తెలియదు కదా మీరు ఆ ఫోన్ ఆన్సర్ చేయండి అని చెప్తుంది. అప్పుడు రిషి ఫోన్ తీసి మాట్లాడుతూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లు తెలుసుకోవాల్సిందే…
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…