కేసినో కింగ్ గా పేరొందిన చికోటి ప్రవీణ్ అరెస్ట్ అయ్యారు. కాకపోతే ఆయన అరెస్ట్ జరిగింది హైదరాబాద్ లో కాదు. థాయ్ లాండ్ లో. పట్టాయలో ఓ లగ్జరీ హోటల్ లో బుక్ చేసుకొని ఇండియా నుంచి 83మందిని తీసుకెళ్ళిన ప్రవీణ్ అక్కడ జూదం ఆడిస్తున్నాడు. ఈ విషయం అక్కడి పోలీసులకు తెలియడంతో దాడి హోటల్ పై దాడి చేశారు. అక్కడ పట్టుబడిన వారందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
పట్టాయలోని హోటల్ లో 83మందితో గ్యాంబ్లింగ్ ఆడుతోన్న విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. పోలిసుల కళ్లుగప్పి కొంతమంది పారిపోయేందుకు ప్రయత్నించి దొరికిపోయినట్లుగా అక్కడి వార్తపత్రిక కథనం ప్రచురించింది. ఇందుకు సంబందించిన ఫోటోలను ద నేషన్ థాయ్ లాండ్ పత్రిక విడుదల చేసింది. ఈ ఫోటోలలో ఉన్న వారంతా తెలుగురాష్ట్రాలకు చెందిన వారేనని తెలుస్తోంది. గతంలో చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసుల్లో ఈడీ ప్రశ్నించిన వారే ఎక్కువగా ఉన్నారు. మాధవరెడ్డి అనే వ్యక్తితో పాటు మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి కూడా పోలీసులకు పట్టుబడిన ఫోటోల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలు కూడా పట్టుబడినట్లు సమాచారం.
నిందితుల వద్ద భారీగా నగదు ఉన్నట్లు తెలుస్తోంది. వారి వద్దనుంచి గేమింగ్ చిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన వారిలో పన్నెండు మంది మహిళలు కూడా ఉండటంతో గ్యాంబ్లింగ్ కి మించి ఎదో జరుగుతోందన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…