తెలంగాణ ఉద్యమ సమయంలో రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్త బంధం విలువ నీకు తెలియదురా…నుదుటి రాతలు రాసే ఓ దేవ దేవా..తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా అంటూ అమరుల తల్లుల కడుపుకోతను పాటతో వినిపించిన ఉద్యమ గళం మూగబోయింది. ఒక్క పాట ఎంతోమందిని కదిలిచింది. తెలంగాణ వ్యతిరేకులను సైతం కంటతడి పెట్టించింది. ఉద్యమానికి మద్దతు తెలిపేలా చేసింది.
తన మధురమైన గొంతుతో ఎన్నో పాటలు పాడిన సాయిచంద్ గుండెపోటుతో అకాల మృతి చెందారు. నాగర్ కర్నూల్ కారుకొండలోని ఫామ్ హౌజ్ లో ఉండగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాయత్రీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆయన మృతి చెందారు. గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.
సాయిచంద్(39) విద్యార్ధి దశ నుంచే గాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఉద్యమ సమయంలో ఆయన పాడిన పాటలు ఉద్యమ స్పూర్తిని రగిల్చాయి. ఉద్యమంలో సాయి చంద్ చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు గిడ్డంగుల చైర్మన్ గా నియమించారు.కాగా ఆయన ఆకస్మిక మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మంత్రి హరీష్ కు అత్యంత సన్నిహితంగా ఉండటంతో ఆసుపత్రికి వెళ్ళిన హరీష్… సాయి చంద్ ను అచేతనంగా ఉండటం చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…