telangana minister niranjan reddy about rythu bandhu scheme
Rythu Bandhu : తెలంగాణలో ఖరీఫ్ సీజన్ లో రైతు బంధు డబ్బుల కోసం తెలంగాణ రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తొలకరి జల్లులు కూడా కురిశాయి. దీంతో కొందరు రైతులు విత్తనాలు కూడా నాటుతున్నారు. వరి నారు కూడా వేశారు కొందరు రైతులు. ఖరీఫ్ సీజన్ లో వ్యవసాయం చేయడానికి పెట్టుబడి కోసం కొందరు రైతులు ఎదురు చూస్తున్నారు. ఈనేపథ్యంలో రైతు బంధు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయా అనేది ఎవ్వరికీ క్లారిటీ లేదు. గత సంవత్సరం కూడా ఖరీఫ్ సీజన్ కోసం జులైలో డబ్బులు జమ అయ్యాయి. మరి ఈ సీజన్ లో ఎప్పుడు డబ్బులు జమ అవుతాయా అని రైతులు ఎదురు చూస్తున్నారు.
ఈనేపథ్యంలో రైతు బంధు డబ్బులపై తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే రైతు బంధు డబ్బులు అందరు రైతుల ఖాతాలలో జమ అవుతాయని చెప్పారు. రైతులు ఎవరూ టెన్షన్ పడొద్దు.. ఎవరూ ఆందోళన చెందొద్దు అని ఆయన భరోసా ఇచ్చారు.
అయితే.. కొన్ని రాజకీయంగా చోటు చేసుకున్న కారణాల వల్ల ఇంకా నిధులు రాష్ట్రానికి రాలేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం కావాలని రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపేస్తుందని.. కావాలని తమను ఇబ్బంది పెడుతోందని.. అందుకే రాష్ట్రమే నిధులు సమకూర్చి.. త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈసారి రైతులు ఎక్కువగా పత్తి పంట వేయండి. రైతులకు ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వానికి చెప్పుకొవచ్చు. రైతుల సమస్యల పరిష్కారం కోసమే కాల్ సెంటర్ ప్రారంభించాం. రైతులు సూచనలు, సలహాలు కూడా ఇవ్వొచ్చు అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…