Categories: NewsVideo

Viral Video : తాజ్ ఫలక్ నుమాలో పేదలకు అత్యంత ఖరీదైన ఫుడ్.. హర్ష సాయి వీడియో వైరల్

Viral Video : ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో తనకున్న సబ్ స్క్రైబర్స్ పరంగా హర్ష సాయి ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ గా నిలిచాడు. ఎందరో పేదలను ఆదుకుంటూ, వాళ్లకు కావాల్సిన డబ్బు సాయం చేస్తూ పేరుప్రఖ్యాతలు సంపాదించాడు ఈ కుర్రాడు. నిండా 25 ఏళ్లు కూడా లేని హర్ష సాయికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశమంతా విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు.

youtuber harsha sai opened 5 star hotels for poor

ఇటీవల బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లోకి కూడా హర్ష సాయి వస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి. తాజాగా హర్ష సాయి తన యూట్యూబ్ చానెల్ లో ఓ వీడియోను అప్ లోడ్ చేశాడు. అది హైదరాబాద్ లోని తాజ్ ఫలక్ నుమాలో ఉన్న అతి పెద్ద డైనింగ్ టేబుల్ లో పేదలందరికీ ఉచితంగా ఖరీదైన భోజనాన్ని అందించిన వీడియో. నిజానికి తను ఈ వీడియో చేయడానికి కారణం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో.

ముగ్గురు పిల్లలు తమ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని ఓ పిజ్జా షాపునకు వెళ్తారు. అక్కడి సిబ్బంది వీళ్ల వాలకం చూసి అక్కడి నుంచి వాళ్లను పంపించేస్తారు. ఆ వీడియోను చూసిన హర్షసాయి ఎలాగైనా ఆ పిల్లలను వెతికిపట్టుకొని వాళ్లకు ఫైవ్ స్టార్ హోటల్ లో ఫుడ్ పెట్టించాలనుకుంటాడు.

Viral Video : హర్ష ప్లాన్ వర్కవుట్ అయిందా?

దాని కోసం ముందు హర్ష సాయి ఓ పేద రైతును పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ దగ్గరికి పంపిస్తాడు. వాళ్లను మంచినీళ్లు కావాలి అని అడగమంటాడు. కానీ.. ఆ రైతు వాలకం చూసి ఆయన్ను ఏ హోటల్ సెక్యూరిటీ కూడా లోపలికి వెళ్లనివ్వరు. ఇదంతా సీక్రెట్ గా హర్షసాయి గమనిస్తాడు.

ఒక పేద రైతుకు ఫైవ్ స్టార్ హోటల్ లోకి వెళ్లే భాగ్యం లేదా అని హర్ష సాయి బాధపడతాడు. ఆ తర్వాత ఆయన్ను ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు తీసుకెళ్లి తనకు ఖరీదైన ఫుడ్ పెట్టిస్తాడు. అయినా కూడా హర్ష సాయి సంతృప్తి చెందడు. ఇంకేదో చేయాలనుకుంటాడు. దాని కోసం పేదలందరి కోసం ఫైవ్ స్టార్ హోటల్స్ ను తెరవాలనుకుంటాడు.

అలా.. ముంబై మొత్తం వెతికించి పిజ్జా షాపులో అవమానపడ్డ ఆ పిల్లలను వెతికి, ఇంకా కొందరు పేదలను వెతికి పట్టుకొని అందరినీ హైదరాబాద్ లోని తాజ్ ఫలక్ నుమా హోటల్ కు తీసుకెళ్లి అక్కడ అత్యంత ఖరీదైన డైనింగ్ హాల్ లో రూ.30 వేల ప్లేట్ భోజనాన్ని తినిపిస్తాడు. ఒకేసారి 101 మందికి ఆతిథ్యం ఇచ్చే డైనింగ్ హాల్ అది.

ఆ డైనింగ్ హాల్ లో కూర్చొని ఇప్పటి వరకు మహామహులు తప్పితే సాధారణ ప్రజలు, పేదలు తిన్న దాఖలాలు లేవు. కానీ.. చరిత్రనే తిరగరాస్తూ తాజ్ ఫలక్ నుమాలోకి పేదలు అడుగుపెట్టి అక్కడ అత్యంత ఖరీదైన భోజనాన్ని చేశారు. అలా పలు రాష్ట్రాల్లో కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ ను హర్ష సాయి ఓపెన్ చేశాడు. తాజాగా హర్షసాయి పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. ఆ వీడియో రిలీజ్ అయిన ఒక్క రోజులోనే దానికి రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం గమనార్హం.

Nani

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago