Chiranjeevi : సూర్యకు అభినందనలు తెలిపిన చిరంజీవి… ఎందుకో తెలుసా…?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి జాతీయ చలనచిత్ర పురస్కారాలు సొంతం చేసుకున్న నటీనటులకు, చిత్ర బృందాలకు అభినందనలు తెలిపారు. ఉత్తమ నటుడి విభాగంలో అవార్డును సొంతం చేసుకున్న సూర్య, అజయ్ దేవగణ్ కు చిరంజీవి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న సూర్యకు నా అభినందనలు. నీ పుట్టినరోజు సమయంలో ఇది రావడం మరింత ప్రత్యేకంగా ఉంది. హ్యాపీ బర్త్ డే సూర్య… మీకు మరిన్ని ప్రశంసలు దక్కాలని కోరుకుంటున్నా అని చిరంజీవి సూర్యకు అభినందనలు తెలిపారు.

అలాగే మిత్రుడు అజయ్ దేవగన్ మూడోసారి జాతీయ అవార్డు సొంతం చేసుకున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది అని అభినందనలు తెలిపారు. ‘ అల వైకుంఠపురంలో ‘ సినిమాకి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు దక్కించుకున్న తమన్, ‘ కలర్ ఫోటో ‘ ‘ సూరరై పోట్రు ‘ చిత్ర బృందాలకు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ చిరు వరుసగా ట్వీట్ చేశారు. చిరంజీవితోపాటు మోహన్ లాల్, శరత్ కుమార్, ముమ్ముట్టి, రాధిక, సుహాసిని, కాజోల్, మాధవన్, మంచు విష్ణు ఇలా పలువురు సినీ ప్రముఖులు సైతం జాతీయ అవార్డులు దక్కించుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్లు పెట్టారు.

Chiranjeevi : సూర్యకు అభినందనలు తెలిపిన చిరంజీవి… ఎందుకో తెలుసా…?

Mega star chiranjeevi wishes national film awards winners
Mega star chiranjeevi wishes national film awards winners

2020 కి గాను నటన ప్రతిభతో, కథకథనాల తో అత్యుత్తమంగా నిలిచిన చిత్రాలకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం 68వ జాతీయ పురస్కారాలు ప్రకటించింది. ఎయిర్ డెక్కన్ అధినేత జి ఆర్ గోపీనాథ్ జీవిత కథతో తెలుగు దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ‘ సూరరై పోట్రు’ జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రం గా ఎంపికైంది. ఇందులో ప్రధాన పాత్రలో నటించిన సూర్య ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నారు. అలాగే ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే ‘ తాన్హాజి: ది వారియర్ ‘ లో నటించిన అజయ్ దేవగణ్ సూర్యతో కలిసి ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. సమాజంలోని కుల వివక్షను కళ్లకు కడుతూ తెరకెక్కిన ‘ కలర్ ఫోటో ‘ తెలుగులో ఉత్తమ చిత్రం గా ఎంపికైంది