Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘ పుష్ప ది రైజ్’ ఈ సినిమా ను డైరెక్టర్ .సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో ఇండియా మొత్తం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన శ్రీవల్లి పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. అలాగే పుష్ప మూవీలోని పాటలు, అల్లు అర్జున్ చెప్పే డైలాగ్స్ కి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది.
‘ పుష్ప, పుష్ప రాజ్ తగ్గేదేలే…’ అనే డైలాగ్ నుండి సామీ సామీ పాట నుంచి శ్రీవల్లి పాట ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా సాంగ్ వరకు ప్రతి పాట, ప్రతి డైలాగ్ బాగా పాపులర్ అయ్యాయి.పుష్ప సినిమా పెద్ద హిట్ కావడంతో ఇప్పుడు దాన్ని సీక్వెల్ తీసే పనిలో పడ్డారు డైరెక్టర్ సుకుమార్. పుష్ప-2 మూవీ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే పుష్ప ది రూల్ ఆగస్టులోసెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి.
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప- 2 రిలీజ్ అప్పుడే…

అయితే ఈ సినిమాను సుకుమార్ వచ్చేనెల సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు. ఈ సినిమాను పది భాషల్లో తెరకెక్కించనున్నారు. మరోవైపు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే పుష్ప-2 షూటింగ్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. ఇండస్ట్రీ నివేదిక ప్రకారం చిత్ర నిర్మాతలు పుష్ప-2 సినిమాని 2023, ఆగస్టులో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.అయితే పుష్ప-2 కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ స్థాయిలో పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.
మొదటి సినిమాకి 50 కోట్లు తీసుకున్న బన్నీ రెండో భాగానికి 100 కోట్లు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే సుకుమార్ కూడా పారితోషకం బాగానే తీసుకుంటున్నారని సమాచారం. గత కొన్ని నెలలుగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తో దర్శకుడు సుకుమార్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆగస్టు నెలాఖరు నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది అని సమాచారం