Guppedantha Manasu 6 August Today Episode 522 : గుప్పెడంత మనసు సీరియల్ 6-aug-2022(522) ఎపిసోడ్ ముందుగా మీ కోసం రిషి చిన్నప్పటి నుంచి నేను నిన్ను పెంచాను. మద్యలొ ఏవైనా తప్పులు చేస్తుంటే నన్ను క్షమించు. అంటే మిమ్మల్ని క్షమించమని అడగడమేంటి పెద్దమ్మా అని అంటాడు రిషి.సాక్షి విషయంలో నేను తప్పు చేశానేమో నాన్నా అని దేవియాని అంటోంది కన్నప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదెమో అందుకే అంటున్నాను అని అంటున్నాయి దేవయాని.ఫోన్లో ఇదే చివరి కాలు అని ఎందుకన్నారు పెద్దమ్మా అని అంటాడు రిషి. దేవాయాని ఏదేదో మాట్లాడుతుంది దాంతర్వాత నాకు పక్కన ఉన్న గ్లాసు ఇమ్మని అడుగుతుంది ఆ గ్లాసులొ ముందే పాయిజన్ కలుపుకొని పెట్టుకుంటోంది రిషి తెలియక క్లాసిచ్చాడు ఇచ్చిన తర్వాత చివరిసారిగా నిచేతుల మీదుగా ఈ విషం తాగాలనిపిస్తోందని అనగానే రిషి గ్లాస్ని కిందపడేశాడు. పెద్దమ్మ మీరు విషం తాగడమే ఏంటి అని గట్టిగా అంటాడు రిషి.దేవయాని రిషిని పట్టుకొని ఏడుస్తుంది నీకొక కథ చెప్పన అని అంటోంది దేవయాని.
ఇప్పుడు కథ ఏంటి పెద్దమ్మా అని అంటాడు రిషి.ఆవు, పులి,లేగదూడ కథ చెబుతుంది దేవయాని.పెద్దమ్మ మీరు చచ్చిపోవాలని అనుకోవడమేంటి మీరు చచ్చి పొవడమ౦టే నేనుఛచ్చుపొవడమే కదా దీనికి కారణం ఏంటి అని అడిగితే, దేవయాని సాక్షి పేరు చెప్తోంది. సాక్షి మారిపోయింది రిషి. నీతో పెళ్లి జరిపించనందుకు నా పరువు తీస్తుంది. నన్ను జైలుకి పంపిస్తానని, కోర్టు మెట్లెక్కిస్తానని, కుటుంబ పరువు తీస్తానని, ఎన్నెన్నిమాటలు అందో, అని అనగానే సాక్షి ఇంత దిగజారిందా అని రిషి అంటాడు. తప్పు సాక్షి ది మాత్రమే కాదు, నాది కూడా తనే నీకు కరెక్ట్ అనుకున్నాను, కానీ తను నిజంగానే ప్రేమించింది అందులో ఎటువంటి సందేహం లేదని,నిన్ను పెంచిన ప్రేమతో నీకు కాబోయే భార్యని నిర్ణయించే అధికారం నాకు లేదు కదా నానా, కానీ మాట తప్పి బతకలేకపోతున్నాను, విషం తాగాలని ఉంది,ఇలా ఏవేవో ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది. చివరగా రెండు దారులు ఉన్నాయి అని అంటుంది.
Guppedantha Manasu 6 August Today Episode 522 : దేవయాని పన్నిన కుట్ర ని వసుధార తెలుసుకోగలుగుతుందా.

రిషి నువ్వు సాక్షిని పెళ్లి చేసుకోవడం, లేదా నేను సాక్షి ముందు తల దించుకోవడం, అలా ఎప్పటికి జరగదు, కాబట్టి నేను చచ్చిపోతాను అని బ్లాక్ మెయిల్ చేస్తోంది రిషిని.తర్వాత వసుధార ని గౌతమ్ అడుగుతారు ఎక్కడికి వెళ్లారు మీరు అని, దాంతో జగతి వాళ్లు చెబితే వినాలి, అంతేకానీ అడగకూడదు కదా, అని అనగానే, మహేంద్ర కూడా ఆ అవును అని అంటాడు. అప్పుడు ధరణి ఇవి అడక్కుండా రిషి మూడ్ ఎలా ఉందో అని అడగాలి కదా అని అనగానే, కరెక్టుగా చెప్పావమ్మా ధరణి అని, వసుధార ఎలావుంది రిషి మూడ్ అని అడుగుతాడు.రిషి సార్ ఒక్కొక్కసారి కూల్గా ఉంటారు, ఒక్కొక్కసారి సీరియస్ గా ఉంటాడు, కూల్గా అయితే లేడు మేడమ్ ఖచ్చితంగా చెప్పవచ్చు, అని అంటోంది, నేనిక వెళ్తాను మేడం అని అంటుంది,అప్పుడు జగతి చీకటి అయింది, ఇక్కడే ఉండు రాత్రికి అని అంటుంది.ధరణితో వసుధార ని రూంలోకి తీసుకెళ్ళు అనగానే, వాళ్లు బయటికి వెళుతుండగా, రిషి దేవయాని గదిలో నుంచి వస్తూ ఉంటాడు, తనను చూసి సైలెంటుగా వెళతాడు, దేవయాని వసుధార ని పిలుస్తుంది.
ఎలాగైనా నువ్వే రిషిని కాపాడాలి అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార ఎందుకు భయపడుతున్నారు మేడమ్ రిషి సార్క్ ఏమి కాదు అని అంటూ ఉంటుంది.అప్పుడు దేవయాని ఎలాగైనా నువ్వే సహాయం చెయ్యాలి, అని అంటూ ఉంటుంది. అప్పుడు వసుధార సరే అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.తరువాత తెల్లారి రిషి ఆలోచిస్తూ ఉంటాడు దేవయాని మాటలను, ఇంతలో వసుధార కాఫీ తీసుకుని వస్తుంది, రిషి వద్దు అని అంటాడు.అప్పుడు వసుధార కాఫీ పక్కనపెడుతుంది, వద్దు అని చెప్పాను కదా అని రిషి అనగానే, ఒక్కొక్కసారి వొద్దు అనుకున్నవి తరువాత కావాలనిపిస్తుంది, ఆలోచించండి సార్ అని అంటుంది.అప్పుడు రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు, సార్ కాఫీ అని వసుధార అనగానే, వద్దు అని అన్నాను కదా అని వెళ్లిపోతాడు. తరువాత వసుధార రెస్టారెంట్లో రిషి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కస్టమర్ ఒకతను ఐస్క్రీమ్ అడిగితే, కాఫీ ఇస్తుంది, రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా రాలేదు అని, ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.