Janvi Kapoor : అలనాటి శ్రీదేవి కూతురే జాన్వి కపూర్. ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా శ్రీదేవి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు తన కూతురు జాన్వి కపూర్ కూడా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది. బాలీవుడ్ లో ‘థడక్ ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ద్వారా జాన్వి యువకుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమాలోని పాటలు మంచిగా హిట్ కావడంతో ఈ సినిమాకి క్రేజ్ ఇంకా పెరిగింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత జాన్వీ సినిమాలతో బిజీగా గడుపుతూ వస్తుంది. తల్లికి మించి పరువాలను ఆరబోయటంలో ముందు ఉంటుంది జాన్వీ. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ సినిమా విడుదలకు ముందే శ్రీదేవి అకాల మరణం చెందింది.
అయితే జాన్వి కపూర్ సినిమాలోకి వస్తా అని చెప్పినప్పుడు శ్రీదేవి ఇందులోకి రావద్దని సలహా ఇచ్చిందంట. ఈ విషయాన్ని జాన్వి కపూర్ నే స్వయంగా చెప్పింది. తాజాగా ఈ అమ్మడు మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో అనేక కబుర్లను వివరించి నా జీవితమంతా సినిమాల్లోనే పనిచేశాను. మీకు మంచి జీవితాన్నిచ్చాను. సినిమాలో రాణించడం అంత సులభం కాదు. ఇందులోకి ఎందుకు రావాలనుకుంటున్నావ్. సినిమాలంటే చాలా ఇష్టం ఉంటేనే ఇందులోకి రావాలి, నువ్వు చాలా సున్నిత మనస్కురాలివి, సినీ పరిశ్రమలో అనేక ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని తట్టుకొని ఇక్కడ నిలబడాలి. ఆ విధంగా నిన్ను చూడటం నాకు ఇష్టం లేదు అంటూ శ్రీదేవి జాన్వికి చెప్పిందంట.
Janvi Kapoor : శ్రీదేవి ఏమని చెప్పిందో తెలుసా…

తాజాగా జాన్వి కపూర్ ‘ గుడ్ లక్ జెర్రీ ‘ సినిమాలో నటించింది. ఈ సినిమాకు సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సుబాస్కరన్, ఆనంద్ ఎల్ రాయ్ సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ సినిమాలో దీపక్ దోబ్రియాల్, మిత వశిష్ట్, నీరజ్ సూద్, సుశాంత్ సింగ్ కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాను డిస్నీ హాట్ స్టార్ లో నేరుగా విడుదల చేశారు. లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ‘ కోలమావు కోకిల ‘ కూ రిమేక్ గా ‘ గుడ్ లక్ జెర్రీ ‘ సినిమా విడుదలైంది. ఈ మధ్యనే ఈ సినిమా గురించి నయనతార చార్మిని మెచ్చుకుంటూ ఓ మెసేజ్ చేసింది గారికి సంతోషంగా జాన్వి నయనతార నెంబర్ తీసుకోని మాట్లాడిందంట. అలాగే ఈ అమ్మడు గతంలో నటించిన ‘ గుంజన్ సక్సేన్: ది కార్గిల్ గాళ్ ‘ 2020 లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ సినిమా ద్వారా మంచి పాపులర్ సొంతం చేసుకుంది.