Guppedantha Manasu 11 August Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ 11-aug-2022(526) ఎపిసోడ్ ముందుగా మీ కోసం….. మహీంద్రా జగతి ఇద్దరూ రిషి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా సరే నాకు ఎందుకో ఈ పెళ్ళి జరగదు అనిపిస్తుంది అని జగతి మహేంద్రతో అంటోంది.లగ్నపత్రిక కూడా రాసుకుంటే పెళ్లి ఎలా అగుతుంది అని మహీంద్రా అంటాడు. తొందరపడతాడొ ఏమో కానీ తప్పు నిర్ణయాలైతే రిషి తీసుకోడని నాకనిపిస్తుంది అని చెప్తుంది జగతి.ఏమో జగతి నాకైతే నమ్మకం లేదు అని మహీంద్రా అంటాడు. అలా వాళ్ళిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుంటారు. ఇక ఆ తర్వాత సాక్షి పిలిచిందని రిషి ఒకచోటకి వస్తాడు. సాక్షి కూడా వస్తుంది నేను చెప్పినందుకు నువ్వు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని సాక్షి చెప్తోంది అలాగే అన్ని బెదిరించి జరగవు సాక్షి గుర్తు పెట్టుకో అని అంటాడు ఇక ఆ తర్వాత నువ్వు వసుదార గురించి ఆలోచించకు అని చెప్తాడు. వసుధార మీదికి నీ దృష్టి అస్సలు వెళ్లకూడదని రిషి సాక్ష్యితో చెప్తాడు. రిషి మనమధ్య ఈ టైమ్లో వసుధర టాపిక్ ఎందుకు అని సాక్షి అంటే, ఈ విషయం చెప్పడం కోసమే నేను వచ్చాను ఇది మాత్రమే చెప్పడం కోసం వచ్చాను అని రిషి కచ్చితంగా చెప్పి వెళ్లిపోతాడు. సాక్ష్యియెమె ఈ విషయం గురించే అయితే ఫోన్లో చెపితే సరిపోయేది కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది.
ఇక ఆ తర్వాత దేవయాని జగతి గురించి తనకు తానుగా మాట్లాడుకుంటూ ఉంటుంది చూశావా జగతి నువు ఇంటికొచ్చావని సంబరపడ్డావు. రిషి నీ మాట వింటాడని సంబరపడ్డావు చూశావా దేవయాని ఏదనుకున్నా చెయ్యగలదు ఆఖరికి నేను అనుకుందె చేశానని సంబరపడుతుంది. ఇంతలో దేవయానికి సాక్షి ఫోన్ చేస్తుంది.రిషీ గురించి అన్ని చెప్తూవుంటుంది ఏంటిఅటి ఇది రిషి యిలా వచ్చాడు అలా వెళ్ళిపోయాడు పైగా వచ్చే మొత్తం వసుధార గురించే మాట్లాడుతున్నాడు నేను తట్టుకోలేకపోతున్నాను అదీ ఇదీ అని చెప్తూ వుంటుంది సాక్షి.సాక్షి అసలు నీకు రిషితో పెళ్లి జరుగుతుందంటే అదే గొప్ప విషయం అంతేగానీ రిషి మనసులో ఎవరున్నారో దెని గురించి ఆలోచిస్తున్నాడు ఇవన్నీ ఏమీ పట్టించు కోకు నీ మెడలో తాళి కడితే చాలు తర్వాత రిషినే నువ్వేనని దారిలోకి తెచ్చుకోవచ్చు అని చెబుతూ ఉంటుంది దేవయాని.మనం ఎంతగానో కష్టపడి ప్లాన్ చేసి ఇదంతా చేసింది రిషితో నీపెళ్లి జరగడం కోసమే కదా ముందైతే పెళ్ళి జరగనివ్వను అని మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో జగతి వచ్చి దేవయాని చేతిలో ఫోన్ లాక్కుంటుొది.ఏంటి జగతి అని దేవియని అనగానే నేను కూడా సాక్షితో ఒకమాట చెప్పాలి అక్కయ్యా అని అంటోంది. సాక్షితో సాక్షి ఏదేమైనా ఈ పెళ్ళి జరగదు అని చెప్తుంది జగతి.

ఏంటి అంటే అన్నీ జరుగుతూనే ఉన్నాయి మీరు వచ్చి అక్షింతలు వేయడమే మిగిలింది అని సాక్షి అంటోంది. అనుకోగానే సరిపోదు అని జగతి ఫోన్ పెట్టేస్తోంది.ఏం మాట్లాడుతున్నావు అని దేవయాని అనగానే ప్రపంచంలో చిన్న జంతువైనా,పక్షి అయినా తన పిల్లల్ని కాపాడుకుంటుంది నేను నా కొడుకుని కాపాడుకోలేన అని జగతీ దేవయానితో అంటోంది.సాక్షి బారిన నా కొడుకు పడకుండా నేనుకాపాడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది జగతి.ఇకపోతే వసుదార తన రూములో కూర్చుని జరిగినవన్నీ గుర్తుతెచ్చుకొని బాధ పడుతూ ఉంటుంది.ఇంతలో వసుధరకి గౌతమ్ ఫోన్ చేస్తాడు.గౌతం మాట్లాడుతూనే ఉంటాడు కానీ వసుదార మాట్లాడదు. నువు మాట్లాడు వసుదార నువ్వేం చేయకపోతే ఎలా రిషితో మాట్లాడవా ఏదో ఒకటి చేయాలి వసుదార అని గౌతమ్ చెప్తూ వుంటాడు. వాడు చేస్తుందే తప్పు నిర్ణయం అని నువ్వే చెప్పు. నువ్వు చెప్తే రిషి వింటాడో ఈ పెళ్లి ఆపేస్తాడు అని గౌతమ్ అట్టూనే ఉంటే వసుధార ఏడుస్తూ ఫోన్ కట్ చేస్తూ బాధ పడుతూ ఉంటుంది.ఇక తర్వాత రిషి దగ్గరికి ధరణి కూడా వచ్చి నువు సాక్షిని ఎలా పెళ్లి చేసుకుంటావు అని అడుగుతుంది.వసుధారణ ఇష్టపడుతున్న కదా మరి సాక్షిని ఎలా పెళ్లి చేసుకుంటావు అని అడుగుతుంది ధరణి.వదిన ఈరోజు ఏం కూర చేసారు మీరు అని అడుగుతాడు వంకాయ అని చెప్తుంది మీకు బీరకాయ కదా ఇష్టం వదినా అని అంటాడు రిషి.
Guppedantha Manasu 11 August Today Episode : దేవయాని తో ఎలాగైనా నా కొడుకుని నేను కాపాడుకోగలను అని చెప్పిన జగతి
ప్రతిరోజూ ఒకే కూర తినలేంకదా రిషి అని ధరణి అంటోంది. జీవితం కూడా అంతే వదిన జీవితం వేరు మన ప్రేమ వేరు, మన మనసు వేరు వాస్తవం వేరు జీవితంలో మనం కోరుకునేవి అన్ని జరగాలని ఏం లేదు కదా వదినా, జరిగే వాటిని మనం కోరుకోవాలి అని రిషి ధరణితో చెప్తాడు.ఏదేదో చెప్పి ధరణి అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పాడు రిషి.ధరణి వెళ్ళిపోతూ ఉండగా రిషికి వసుధర నుండి మెసేజ్ వస్తుంది. సార్ ఆఖరిసారిగా మిమ్మల్ని ఒకే ఒకసారి చూడాలనుంది రాగలరా అని మెసేజ్ పెడుతుంది వసుదార ఇదేంటి వసుదార ఇలా మెసేజ్ చేసింది.అనే వస్తారు కి కాల్ చేసి తన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది రిషి వెంటనే భయపడి ఏమైందో అని వసుధర దగ్గరికి వచ్చేస్తాడు. తన రూంలోకి వచ్చి చూస్తాడు.తన రూమ్ లో చేస్తే రిషి తో పంచుకున్న జ్ఞాపకాలన్నీ చూస్తూ ఉంటాడు. అసలు వసుధర ఏమైంది అని తనకి మళ్లీ ఫోన్ ట్రై చేస్తాడు.తన ఫోన్ కాలువతో ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి.వసుధార ఏమో ఒకచోట బెంచ్పై కూర్చుని చందమామను చూస్తూ ఉంటుంది.రిషి ని తలుచుకుంటూ సంబర పడిపోతూ ఉంటుంది వసుసార.ఎక్కడ చూసినా ఏం చేసినా నాకు రిషి సరే గుర్తొస్తున్నాడు అనే వసుధరా అనుకుంటూ తనకుతాను మాట్లాడుకుంటూ ఉంటుంది.చందమామ తో మీకొక అందమైన కథ చెబుతాను వింటారా అది కూడా రిషి సార్ కథే అని అంటోంది వసుధార.
ఒకప్పుడు రిషి సార్ కోపం అంటే నాకు భయమేసేది కానీ ఇప్పుడు రిషి సార్ కోపాన్ని కూడా నేను ఆస్వాదిస్తున్నాను అని అంటోంది వసుదార.రిషి అక్కడికి వచ్చి వసుదారని చూసి నీకసలు బుద్ధుందా ఎవరితో మాట్లాడుతున్నావో ఆ మెసేజ్లు ఏంటి అనే కోప్పడతాడు.ఒకేసారి అన్ని ప్రశ్నలు అడిగితే ఎలా సార్ ఒక్కొక్కదానికి ఓపిగ్గా సమాధానం చెబుతాను అని వసుధరా అంటోంది. నేను ఆకాశంలో ఉన్న చందమామ తో మాట్లాడుతున్నాను. నా బాధని, నా ఫీలింగ్స్ను చెప్తున్నాను మీకధ చెప్తున్నాను సార్. మీరు చెబితే వినరు కదా అందుకే చందమామతో మాట్లాడుతున్నాను అని వసుధార అంటోంది.నువు అల మెసేజ్ చేస్తే నేనేమనుకోవాలి ఎంత కంగారు పడ్డాను నీకు తెలుసా అని రిషి అంటాడు. మీరు తెలిసేలా మెసేజ్ పెట్టాను చనిపొతాననుకున్నారా అని అంటోంది వసుదార. మేరు ఇంతకుముందులాగా లేరుసార్ మారిపోయారు అని వసుదార అంటోంది. ఇంతటితో ఈ రోజు పూర్తవుతుంది.