Fish Health Benefits : వర్షాకాలంలో చేపల వినియోగం ఎక్కువగా కనిపిస్తుంది. ఇటువంటి వాతావరణంలో చాపల పులుసు తింటే… ఆ మజానే వేరుగా ఉంటుంది. చేపలను వారానికి రెండుసార్లు తీసుకున్నట్లయితే మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫిష్ లో అన్ని రకాల పోషకాలు, ప్రోటీన్లు ,విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ ఏ, విటమిన్ డి తో పాటు పాస్పరస్ వంటి పోషకాలు వీటి నుండి మనకు లభిస్తాయి. చేపల్లో ఏమైనా ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు చేపల తినే వారిలో గుండె జబ్బులు మధుమేహం వంటి సమస్యలు తక్కువగా ఎదురవుతాయి. చిన్న చిన్న చేపలు ను ముళ్ళు తో సహా అంతా నెమలి మింగినట్లయితే అందులో ఉండే క్యాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ మన శరీరానికి అందుతాయి. వీటిలో దొరికే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు చాలా మేలు చేస్తాయి.
పెద్ద వయసు వారికి మతిమరుపు సహజంగానే వస్తుంది. కొందరికి ఇది ఎక్కువయ్యి అల్జీమర్స్ కి దారితీస్తుంది. ఇటువంటి సమస్యతో బాధపడేవారు చేపలు తినడం వల్ల విముక్తి కలుగుతుంది. 2016లో అమెరికాలో జరిగిన కొన్ని పరిశోధనలు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అలాగే జ్ఞాపకశక్తి అధికమవుతుందని చెబుతున్నారు. గుండె జబ్బులు సమస్యతో బాధపడేవారు వారంలో రెండు మూడు సార్లు చాపల పులుసు లేదా చేపల ఫ్రై తింటే ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఫిష్ లో ఉండే ఓమైగా3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లైజరేడ్లును తగ్గిస్తాయి. రక్తంలో ఎటువంటి మలినాలు ఉన్న శుద్ధి చేయబడి గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. చేపలు తరచుగా తినడం వల్ల వీటిలో ఉండే డొపమైన్ , సైరోటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్ కంట్రోల్ చేస్తుంది.
Fish Health Benefits : చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకోసం.

రోజు ఎదురయ్యే ఒత్తిడి, మానసిక సమస్యలు తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనలు రుజువయింది. అలాగే చేపల్లో ఉండే అమ్మాయిగా3 ఫ్యాటీ యాసిడ్స్ వివిధ రకాల కీళ్ల నొప్పులను కంట్రోల్ చేస్తాయి. అలాగే ఎన్నో రకాల క్యాన్సర్లను దూరం చేస్తాయి. స్త్రీలలో రుతుక్రమం సరిగా ఉండాలన్న… అదే సమయంలో ఇతర అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఉండాలంటే వారంలో ఒక్కసారైనా సరే చేపలు తినాలని వైద్యులు చెబుతున్నారు. గర్భిణీలు చేపలు తినడం వల్ల కడుపులో బిడ్డకు మంచి ప్రోటీన్ అంది మెదడు బాగా అభివృద్ధి చెందేందుకు ద్రోహదపడుతుంది.
పెద్ద పేగు, మలం ద్వారా వచ్చే క్యాన్సర్లను అదుపు చేయడానికి చేపలు కీలక పాత్ర వహిస్తాయి. రక్తహీనతతో బాధపడే వారికి వారంలో రెండు లేదా మూడుసార్లు చేపలు పెట్టినట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు. హిమోగ్లోబిన్ పెరిగేందుకు కావలసిన ఇనుము చేపల్లో ఎక్కువగా లభిస్తుంది. అలాగే చేపలు కంటి సమస్యలను మెరుగుపరచడంతో పాటు నిద్రలేని సమస్యలను అధిగమిస్తాయి. డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ చేపలను తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం అధికం చేస్తుంది.