Govt Scheme Investment : ఈ పథకంలో రూ.200 జమ చేస్తే.. తిరిగి రూ.32 లక్షలు పొందవచ్చు…

Govt Scheme Investment : ఎవరైనా డబ్బులను సంపాదించుకోవడం ఒక ఎత్తు అయితే వాటిని పొదుపుగా వాడుకోవడం మరొక ఎత్తు. సంపాదించిన డబ్బు అంతా వచ్చింది వచ్చినట్లుగా ఖర్చు చేస్తే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకని పొదుపు చేయడం అనేది ఎప్పటికైనా మేలు చేస్తుంది. అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటే రోజుకి ఎన్నో డబ్బులు మిగులుతాయి. ఆ డబ్బులను కొన్ని పథకాలలో చేరిస్తే రోజుకు రూ.200 చొప్పున పొదుపు చేస్తే 20 ఏళ్లలో లక్షాధికారి కావచ్చు. అత్యవసర పరిస్థితి వచ్చిందంటే అప్పులు చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే నెలకి వచ్చే సంపాదనలో ఎంతో కొంత పొదుపు చేయడం మంచిది. ఇలా చేయడం వలన కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటుంది.

అయితే డబ్బులను పొదుపు చేసుకునేందుకు బ్యాంకులో, పోస్ట్ ఆఫీస్ లు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాయి. అందులో వడ్డీ ఎక్కువ వచ్చేవి కూడా ఉన్నాయి. బ్యాంకులో కంటే పోస్ట్ ఆఫీస్ లో పొదుపు చేసిన డబ్బులకు ఎక్కువగా వడ్డీ వస్తుంది. అయితే రెండింటిలోనూ ఒకటే వడ్డీ రేటును ఇచ్చే ఓ పథకం ఉంది. అదే ప్రభుత్వం పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ (పీపీఎఫ్). ఈ పథకంలో పెట్టుబడి పెడితే 20 ఏళ్లలో మీరు 32 లక్షల వరకు ఫండ్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే దీనికి రోజుకు రూ.200 పొదుపు చేయాల్సి ఉంటుంది.

Govt Scheme Investment : ఈ పథకంలో రూ.200 జమ చేస్తే.. తిరిగి రూ.32 లక్షలు పొందవచ్చు…

Govt.scheme you pay Rs.200 you will returns 32 lakhs
Govt.scheme you pay Rs.200 you will returns 32 lakhs

అంటే నెలకు 6000 మీ జీవితంలో నుంచి పక్కన పెడితే 20 ఏళ్లలో లక్షాధికారులు కావచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది దీర్ఘకాలిక పొదుపు. ప్రస్తుతం పీపిఎఫ్ పై 7.1 శాతం వరకు వడ్డీ చెల్లిస్తున్నారు. అయితే మీరు పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఖాతాను తెరవడానికి రూ.500 రూపాయలు చాలు. ఇందులో ఏటా 1.50 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ ఖాతా మెచ్యూరిటీ 15 ఏళ్ళు ఉంటుంది. అయితే మెచ్యూరిటీ తర్వాత మరో 5 ఏళ్ల వరకు పొడిగించుకోవచ్చు. ఇలా అయితే 20 ఏళ్లలో లక్షాధికారులు కావచ్చు