Devotional Tips : తెలుగు సాంప్రదాయల ప్రకారం ఆచారాలు పద్ధతులు ఎక్కువగా పాటిస్తారు. పూర్వం నుండి కూడా తెలుగువారు వారి ఆచారాలు ప్రకారం పూజలు చేస్తారు. ఇక ప్రతిరోజు పూజ చేసి దేవాతి దేవుళ్ళ అనుగ్రహం పొందాలనుకుంటారు. ఇలా రోజు ఉదయం సాయంత్రం పూజ చేయడం పూర్వం నుండి ఆనవాయితీగా వస్తోంది. ఇలా నిత్యం దీపరాధన చేసి భగవంతుడు నీ నామాన్నిస్మరిస్తూ జీవించేస్తున్నారు. మరి కొంతమంది ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా వారానికి ఒకసారి పూజ చేయడం కోసం పూజ గదిని శుభ్రం చేసి కలశాన్ని అలంకరించుకొని ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో పూజ చేసిన భగవంతున్ని కోరుకునేది ఒకటే..
ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు ,ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని కోరుకుంటారు. అయితే మనం పూజ చేసిన దానికి పది రెట్లు ఫలితం పొందాలంటే తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిత్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. మనం పూజ చేసే ముందు రోజే దేవుని గది శుభ్రం చేసుకుని పూలు, పండ్లు ,అక్షింతలు సిద్ధం చేసుకోవాలి. అలాగే దేవుడు ఫోటోలు కూడా శుభ్రం చేసుకుని బొట్లు పెట్టాలి. శివుడికి విభూదితో, శ్రీహరికి గంధంతో బొట్టు పెట్టడం శ్రేయస్కరం . చాలామంది నైవేద్యాన్ని స్టీలు ,ప్లాస్టిక్ లో దేవుడికి సమర్పిస్తారు.
Devotional Tips : ఇటువంటి నియమాలు పాటిస్తే….. పూజ ఫలితం పదిరెట్లు అవుతుంది.

అలా చేయడం మంచిది కాదు. ఎప్పుడు కూడా వెండి గిన్నెలో కానీ, తమలపాకులో, అరిటాకులులో కానీ నైమిద్యాన్ని సమర్పించాలి. అలాగే నైవేద్యం పెట్టిన తర్వాత ఆరతి ఇచ్చి దాని చుట్టూ నీళ్లు చల్లి అప్పుడు హారతి తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ఆ తర్వాత దేవుడు గది నుండి ఐదు నిమిషాలు బయటకు వెళ్లి వచ్చిన తర్వాత నైవేద్యాన్ని తీసుకోవాలి. మరి కొంతమంది దీపాలల్లో ఒత్తులు ముందుగా ఏసి ఆ తర్వాత నూనెను పోస్తారు. కానీ అలా చేయడం మంచిది కాదు. ముందు నూనె పోసి ఆ తర్వాత ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. ఈ నియమాలు పూజ సమయంలో పాటిస్తే తప్పకుండా విజయాలు మీ సొంతమవుతాయి.