Guppedantha Manasu 1 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 1-September- 2022 ఎపిసోడ్ 544 ముందుగా మీ కోసం. రిషి ఎగ్జామ్ ఎలా రాశారు అనగానే, బానే రాసమని అంటారు. బానే కాదు, మంచిగా రాయాలి, టైమ్ వేస్ట్ చేయకుండా చదవాలి అని, ఇన్ డైరెక్టుగా వసుధారకి చెప్పి వెళ్లిపోతాడు.అప్పుడు పుష్ప, మనము కాలేజ్ని చాలా మిస్ అవుతాం కదా వసుధార అని అంటూ ఉంటుంది. ఒకవైపు సాక్షి దేవయాని మాట్లాడుకుంటూ ఉంటారు, దేవయాని సాక్షితో అంటోంది వసుధారాని అందరూ నెత్తికెక్కించుకున్నారు. పరీక్షలు బాగా రాస్తే, తరవాత పెళ్లి కూడా అని అంటారేమో, ఏదో ఒకటి చెయ్యాలి. వసుధారని పరీక్షలు రాయకుండా చేసి, వాళ్లిద్దర్ని దూరం చేయొచ్చు అని అంటోంది.
Guppedantha Manasu 1 September 2022 Episode : వసుధారని రిషి కాపాడగలడా?
అప్పుడు మనం గెలవచ్చు అని, వసుధార పరీక్షలు రాయకుండా చెయ్యాలని కుట్రపన్నుతారు. వసుధార లైబ్రరీకి వెళ్ళబోతూ ఉండగా, జగతి, మహేంద్ర ఎదురుపడి, రూమ్ దాకా దించుతాము అని అంటే, నాకు లైబ్రరీలో పనుంది మేడం నేను వెళతాను అని చెప్తుంది. ఇంతలో రిషి అక్కడికి వచ్చి, జగతితొ మేడమ్ ఎగ్జామ్స్ ఎలా రాశారు అందరూ అని, ఇన్ డైరెక్టుగా వసుధారని అడుగుతారు.తరువాత వసుధార లైబ్రరీకి వెళుతూ ఉండగా, రిషి మెసెస్ చేస్తాడు,ఎగ్జామ్ ఎలా రాశావని, ఇలా కొద్దిసేపు వాళ్లు మెసెస్ చేసుకుంటూ ఉండగా, రిషికి ఫోను వచ్చి వెళ్ళిపోతాడు,సాక్షి వసుధారని ఒక కొత్త వ్యక్తి చేత కిడ్నాప్ చేయిస్తుంది.

రిషి మెసేజ్ చేసిన, ఫోన్ చేసినా ఆన్సర్ చేయకపోవటంతో, కంగారుగా వసుధార రూమ్ కి వెళతాడు రిషి, గౌతమ్. అక్కడ కూడా లేకపోవడంతో,క్యాంటీన్ మేనేజర్ కి ఫోన్ చేస్తాడు అక్కడికి వచ్చిందా అని, అక్కడికి కూడా రాకపోవడంతో, జగతికి ఫోన్చేసి అడుగుతాడు వసుధార గురించి కంగారుగా, తర్వాత కంగారుగా కాలేజ్ కి వెళతాడు వెతకడానికి. జగతి మహేంద్ర ఇంట్లోనుంచి వెళుతుండగా, ఏమైంది అని దేవయాని అడుగుతుంది. జరిగింది చెప్పగానే, సాక్షికి మెసెస్ చేస్తుంది దేవయాని.రిషి, గౌతమ్ కాలేజీకి వెళ్లి వెతుకుతారు. ఇంతలో జగతి, మహేంద్ర కూడా వస్తారు. అందరూ కలిసి వెతుకుతూ ఉంటారు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.