Kalyan Ram : ‘ ఎన్టీఆర్ 30 ‘ సినిమా ఆలస్యంపై స్పందించిన కళ్యాణ్ రామ్… ఎన్టీఆర్ లో ఆ రెండు పెరిగిపోయాయి అంటూ కామెంట్స్..

Kalyan Ram : టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు ఎన్టీఆర్. అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ఎన్టీఆర్ ముందుంటారు. ఆయన సినిమా అంటే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ‘ ఆర్ఆర్ఆర్ ‘ మూవీ తర్వాత ఎన్టీఆర్ పై అంచనాలు మరింత పెరిగాయి. తరువాతి సినిమా గురించి అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తారక్ తన తరువాత చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నారని అందరికీ తెలిసిందే.

ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యవసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. ‘ ఎన్టీఆర్ 30 ‘ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చేసింది కానీ ఇంతవరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ‘ ఎన్టీఆర్ 30 ‘ సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకా సమయం పడుతుందట. దీంతో అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా బయటకు వస్తున్నాయి. కానీ ఈ వార్తలపై ఎన్టీఆర్ బృందం ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. ‘ ఎన్టీఆర్ 30 ‘ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు ఎటు తేల్చుకోలేక పోతున్నారు.

Kalyan Ram :ఎన్టీఆర్ లో ఆ రెండు పెరిగిపోయాయి అంటూ కామెంట్స్..

Hero Kalyan ram talk about ' NTR 30 ' movie
Hero Kalyan ram talk about ‘ NTR 30 ‘ movie

ఈ క్రమంలో ఎన్టీఆర్ సోదరుడు నిర్మాత అయిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ‘ ఎన్టీఆర్ 30 ‘ సినిమా గురించి మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఇప్పటివరకు బయటకు రాలేదు. ఎక్కడ మాట్లాడలేదు. ఎన్టీఆర్ ఏం మాట్లాడుతాడోనని తన తదుపరి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వబోతున్నాడని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని అన్నారు.అలాగే ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమాతో ఎన్టీఆర్ ఇమేజ్ పాన్ ఇండియా కాదు గ్లోబల్ గా మారింది. ఇలాంటి సమయంలో తరువాత చేయబోయే సినిమాపై ఎన్టీఆర్ కు చాలా బాధ్యత ఉంటుంది.

ఓ స్టేజ్ కు వెళ్ళిన తర్వాత భయం, బాధ్యత పెరిగిపోతాయి. దానివల్ల జాగ్రత్త కూడా పెరిగిపోతుంది. కాబట్టి ‘ ఎన్టీఆర్ 30 ‘ సినిమా విషయంలో తారక్ చాలా ఆలోచిస్తున్నారు. నిర్మాతలుగా మాపై కూడా చాలా బాధ్యత ఉంది. మేము కూడా అంతే ఆలోచిస్తున్నాం. డైరెక్టర్ కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆయనలో ఎంత ప్రెషర్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందువల్ల అభిమానులు ఎక్స్పెక్ట్ చేసేంత ఫాస్ట్ గా అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాం అని నందమూరి కళ్యాణ్ రామ్ తెలిపారు