Janaki Kalaganaledu 21 July Today Episode : జానకి కలగలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా విడుదలయింది. 21 గురువారం ఎపిసోడ్ 349 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. జానకి రామ కాలేజీకి వెళ్లడానికి రెడీ అయి బయటికి వస్తారు. అప్పుడు జ్ఞానంబ గోవిందరాజు బయట ఉంటారు. జ్ఞానాంబ ఎక్కడికి వెళ్తున్నారు రామ అని అడుగుతుంది. రామ జానకి గారు చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవాలంటమ్మా, అందుకే వెళ్తున్నాము అని చెప్తాడు. అంతలో మల్లిక అసలే జానకి కాలు నొప్పి అంటే, ఆ నొప్పితో ఎలా బయటికి వెళ్తారు.
బావగారు అని అంటుంది. జ్ఞానాంబ అవును అమ్మ, కాలినొప్పితో ఎలా బయటికి వెళ్తావ్ అమ్మ వద్దులే, ఈరోజు రెస్ట్ తీసుకో, అని అంటుంది జ్ఞానాంబ. మల్లిక ఆత్రుతగా వెళ్ళు జానకి వెళ్ళు లోపలికి వెళ్ళు అని అంటుంది. గోవిందరాజు అమ్మ తాలింపుల మల్లికా నువ్వు కాస్త ఆగమ్మ నీ తోటి కోడలు సరదాగా బయటికి వెళ్ళడం కూడా నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అని అంటాడు. మల్లిక అది ఏంటి మావయ్య గారు నేను జానకి కాల్ గురించి ఆలోచిస్తుంటే, మీరు తాలింపు, గిలింపు అని సెటైర్ వేస్తారు. నా మీద ఊరుకోండి మావయ్య గారు, అని అంటుంది.

మల్లికా, గోవిందరాజు జ్ఞానం కాలికి దెబ్బ తగిలినప్పుడు బయటకు వెళ్తే కాలు కూడా సాగుతుంది అని అంటాడు. మల్లిక ఎన్ని మీటర్లు సాగుతుంది. మావయ్య గారు అని అంటుంది. ఇప్పుడు నీ మూతి సాగిందే అన్ని మీటర్లు సాగుతుందమ్మ, నువ్వు ఊరుకో అని అంటాడు. గోవిందరాజు, జ్ఞానంబ నీకు కాలి కి దెబ్బ తగిలినప్పుడు నా ప్రాణం విలవిల్లాడిపోయింది అమ్మ, నీకు ఆ నొప్పి ఎక్కువై నువ్వు బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేవనమ్మ, జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకురా అని చెప్తుంది.
Janaki Kalaganaledu 21 July Today Episode : అయితే జ్ఞానంబా తననీ అర్థం చేసుకొని చదువుకోవడానికి ఒప్పుకుంటుందా…
మల్లిక లోపల గులుక్కుంటూ ఉంటుంది. ఇంతలో గోవిందరాజు, తనపై సెటైర్లు వేస్తూ ఉంటాడు.
కాలేజీలో లెక్చరర్ ఇప్పటివరకు ఎంత కష్టపడ్డారు అంతకుమించి కష్టపడాలి అని అందరికీ క్లాస్ చెప్తూ ఉంటాడు. ఇప్పటివరకు మీరు రాసిన ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వస్తే సీల్డ్ ప్రజెంటేషన్ చేస్తారు. అని అంటాడు. తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్స్ కోసం ఒక పోలీస్ కమిషనర్ వచ్చి అందరి చెక్ చేస్తూ ఉంటాడు. కానీ జానకి తీసుకురాలేదు. కంగారు పడుతూ ఉంటుంది. సర్టిఫికెట్స్ కోసం నాకు ఫోన్ రాలేదు.
సార్ సారీ సార్ అని అంటుంది. ఈరోజు తీసుకురాలేని వారు రేపు షీల్డ్ ప్రజెంట్ చేసేటప్పుడు తీసుకొచ్చి సబ్మిట్ చేయాలి కంపల్సరిగా అని అంటాడు. జానకి నా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అత్తయ్య గారి దగ్గర ఉన్నాయి. ఎలా తీసుకోవడం అని చాలా భయపడుతూ ఉంటుంది. ఇంటికి వచ్చి రామతో చెప్తుంది. రామ జానకి మీద కాపాడుతూ ఉంటాడు. మీరు ఎలా ఇచ్చారండి, ఎందుకిచ్చారండి, మీరు ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశారండి, అని తిడుతూ ఉంటాడు. రామ గారు మీ కోపంలో అర్థం ఉంది.
కానీ అప్పుడు ఆ సిచువేషన్ లో ఇవ్వాల్సి వచ్చింది. నేను ఎక్కడ చదువుకుంటానని అత్తయ్య గారు కంగారుపడుతుంటే నేను ఇచ్చేశాను. ఆరోజు నేను ఆ సర్టిఫికెట్స్ ఇవ్వకపోతే నన్ను ఇంట్లో ఉండనిచ్చేది కాదు, అని అంటుంది. జానకి, మీరు చెప్పింది కరెక్టే కానీ ఇప్పుడు ఎలా మీకు అక్కడ సర్టిఫికెట్స్ కావాలి. ఇప్పుడు ఇన్ని రోజులు చేసిందంతా, బుడదలో పన్నీరు అవుతుంది. అని బాధపడుతూ ఉంటాడు రామా , జానకి మీరేం కంగారు పడకండి దేవుడు ఏదో ఒక రూపంలో మనకి సాయం చేస్తాడు అని అంటుంది.
జానకి, కట్ చేస్తే సావిత్రి కూతురు ఏడుస్తూ వచ్చి తలుపు కొడుతుంది. జ్ఞానంబ తలుపు తీసి ఏమైంది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది. అప్పుడు ఆమె నాకు అత్తారింటికి వెళ్లడం అసలు ఇష్టం లేదండి మా వాళ్ళు నన్ను బలవంతంగా పంపిస్తున్నారు. అందుకే మీ దగ్గరికి వచ్చాను. మీరైనా చెప్పండి అని అంటుంది. సరేలే లోపలికి రా మీ అమ్మ వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్తాను, గాని అని లోపలికి తీసుకెళ్తుంది. కట్ చేస్తే జానకి అత్తయ్య గారికి నా చదువు గురించి చెప్పేస్తాను అని అంటుంది.
రామ మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా. మీరు చదివింది ఐదో తరగతి కాదు, డిగ్రీ అని తెలిసినప్పుడు అమ్మ ఎంత బాధ పడిందో, ఆ బాధ నుంచి బయటికి రావడానికి ఎంత టైం పట్టిందో మీకు తెలుసు కదా.. ఇప్పుడు నేను ఎవరికి తెలియకుండా చదివిస్తున్నాను. అని అంటే ఇంకెంత బాధ పడుతుందో మీకు అర్థం అవుతుందా. అండి. అది ఎంత ప్రమాదమో ఆ పరిస్థితులు ఎంత దూరం వెళ్తావో, మీకు అన్ని తెలిసి కూడా అలా ఎలా చెప్తారండి, అని అంటాడు.
రామా, సర్టిఫికెట్ సర్టిఫికెట్స్ కోసం కాకపోయినా నేను సివిల్స్ కోచింగ్ తీసుకున్నట్లు అత్తయ్య గారికి చెప్పి తీరాలి, రామ గారు, ఎన్నాళ్ళని దాచిపెడతామండి ఇది ఏనాటికోనాటికి తెలియాల్సిందే, కదా ఇలా తెలియకుండా ఉంచడం, వలన ఇంకా పెద్ద సమస్యలు ఏర్పడతాయి. ఇప్పుడు నేను సర్టిఫికెట్స్ తీసుకెళ్లకపోతే దొంగ సర్టిఫికెట్స్ పెట్టి నేను చదువుకుంటున్నాను అని అనుకుంటారు.
తర్వాత మన ఇంటికి వచ్చి ఎంక్వయిరీ చేస్తారు. అదే గనుక జరిగితే నేను కోచింగ్ తీసుకుంటున్నట్లు అత్తయ్య గారికి తెలుస్తుంది. అప్పుడు ఎవరో చెప్పడం వల్ల తెలిస్తే ఇంకా బాధపడతారు. అందుకే నేనే చెప్పేద్దామనుకుంటున్నాను. నిజమే జానకి గారు కానీ మీరు చెప్పడం వలన మీరు చదువుకోడానికి అమ్మ ఒప్పుకుంటుందా, నాకు ఈ ఐపీఎస్ ఎంత ముఖ్యమో నాకు చదువు అంటే ఎంత ఇష్టమో ఐపీఎస్ నా కల అని నేను అత్తయ్య గారికి ఎలాగోలా చెప్పుకుంటానండి.
అత్తయ్య గారిని ఒప్పించడానికి నేను నా సాయి శక్తుల ట్రై చేస్తానండి. అత్తయ్య గారు అర్థం చేసుకుని నేను చదువుకోడానికి ఒప్పుకుంటుందని నమ్మకం నాకుంది. జానకి చెప్పడానికి జ్ఞానం దగ్గరికి వస్తుంది. ఇంతలో జ్ఞానంబ సావిత్రి కూతురు గురించి చేస్తూ ఉంటుంది. అసలు మీ అమ్మాయి సమస్య ఏంటి ఎందుకు అత్తారింటికి వెళ్లానంటుంది. అని అడుగుతుంది జ్ఞానంబ, అప్పుడు ఆమె తల్లిదండ్రులు తప్పంతా మా అమ్మాయి దగ్గరే ఉందండి మా అమ్మాయి అత్తవారింట్లో 10 గంటల వరకు నిద్రపోతుందండి.
అదే పెద్ద సమస్య అండి అని చెప్తారు. జ్ఞానంబ ఏంటమ్మా అలా ఎలా పడుకుంటావు అత్తవారింట్లో తొందరగా లేవాలి అని నీకు తెలియదా అని అంటుంది. అప్పుడు ఆమె నాకు మా ఇంట్లో 10:00 వరకు పడుకునే అలవాటు ఉందండి అక్కడ వెంటనే లేవాలి . నాకు అలవాటు కావాలి కదండీ అని అంటుంది. నా కోడలు జానకిని చూసి నేర్చుకుంటామని చెబుతున్నాను.తను డిగ్రీ వరకు చదివింది. తను ఐపీఎస్ కావడం తన కల, కానీ నాకు జరిగిన ఇన్స్టెంట్ వల్ల తను చదువుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పగానే, చదువు అని ఆలోచన తీసివేసింది.
తను చదువుకున్న కాగితాలను నాకు ఇచ్చేయ్ అనగానే ఒక క్షణం ఆలోచించకుండా నాకు ఇచ్చేసింది. వాటి గురించి ఇప్పటివరకు ప్రస్తావన అంటూ తీసుకురాలేదు. ఎందుకంటే భవిష్యత్తులో నాకు ఇచ్చిన మాటని గిరి దాటకుండా ఉండడానికి, తనకు ఎంతో ఇష్టమైన చదువు నే వదిలేసుకుంది. నా కోడలు, నువ్వు నిద్రని అలవాటు చేసుకోలేవ. మన అలవాట్లు మన ఇష్టాలు ఎదుటివారిని బాధపెట్టేలా ఉండకూడదమ్మ, ఈ విషయంలో నా కోడలు నిజంగా దేవత, తన చదువుని త్యాగం చేసింది. నాలో ఉన్న భయాన్ని పోగొట్టింది.
ఇప్పుడు మేమందరం ఎంత సంతోషంగా ఉంటున్నాము, అంటే దానికి కారణం నా కోడలు, ఆరోజు నేను మాట ఇవ్వు అని అడిగినప్పుడు తను నేను ఇవ్వను, అని మొండిగా ఉంటే నా ఇల్లు ఇప్పుడు రెండు ముక్కలవేయేది, వాళ్ళ కాపురం దూరం అయ్యేది, పంతాలకు పోతే బంధాలు తెగిపోతాయమ్మ, ప్రేమతో బంధాలు నిలబడతాయి. నీ పంతంతో ఇలా చేస్తే నీ పుట్టింటి వాళ్లు, అటు మెట్టినింటి వాళ్ళు బాధపడతారు అమ్మ అది అర్థం చేసుకో, ఎంచక్కా నువ్వు కాపురానికి వెళ్లి నీ నిద్ర అలవాటుని మార్చుకో అని చెప్తుంది జ్ఞానంభ, అమ్మ జానకి నువ్వైనా చెప్పు అని అంటుంది. జ్ఞానంభ, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.