Krithi Shetty: హిరో నితిన్ నటిస్తున్న మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా ‘ మాచర్ల నియోజకవర్గం ‘. ఈ సినిమాలో మొదటిగా రష్మికాను తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ తర్వాత కృతి శెట్టిని తీసుకున్నారట. సినీ పరిశ్రమలో ఒకరి సినిమాలు మరొకరి చేతిలో పడడం అనేది సాధారణమే. హీరో హీరోయిన్స్ విషయంలో ఎక్కువగా జరగటం చూస్తుంటాం. అయితే కృతి శెట్టి విషయంలో కూడా అదే జరిగింది. రష్మిక మందన చేయాల్సిన సినిమా కృతి శెట్టి చేతిలో పడిందంట. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాను శ్రేస్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రైలర్లో కృతి హంగామా చేస్తుంది. ఈ సినిమా కృతి కెరీర్లో ఒక మెట్టు ఎక్కే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఈ సినిమాలో స్వాతి అనే సాధారణ అమ్మాయి పాత్రలో బేబమ్మ కనిపించనుంది. అయితే ఈ ఆఫర్ ముందుగా కృతి శెట్టి కి రాలేదట. ఈ సినిమా కోసం మొదటిగా రష్మిక మందన ఎంచుకున్నారట దర్శకనిర్మాతలు. ఈ మేరకు రష్మిక తో సంప్రదింపులు జరిపి భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. అయితే తనకు డేట్స్ అడ్జస్ట్ కావడం లేదని కారణం చెప్పి ఈ ప్రాజెక్టు నుంచి తప్పించుకుందంట రష్మిక.
Krithi Shetty : రష్మిక ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ

దీంతో ఆఫర్ కృతి శెట్టి కి దక్కిందని అంటున్నారు. దీనితో గతంలో నితిన్ తో కలిసి భీష్మ సినిమాలో సూపర్ హిట్ అందుకున్న రష్మిక ఈ సినిమా ఎందుకు వదులుకున్న అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. రష్మిక నితిన్ మధ్య వైరం అనే టాపిక్ నడుస్తుంది. భీష్మ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, రష్మిక నటించడం లేదని కొందరు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా కృతి శెట్టికి దక్కింది.ఈ సినిమా ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా క్యాథరిన్ నటిస్తుంది స్పెషల్ సాంగ్ లో అంజలి కనిపించింది.