Mahesh Babu : మహేష్ బాబు భార్య అయిన నమ్రత శిరోద్కర్ ఒకప్పుడు మిస్ ఇండియా గా ఎంపికైంది. ఈ అమ్మడు మొదటిగా రూపదర్శికగా పనిచేసింది. తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తర్వాత మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది. తెలుగు పరిశ్రమలో బ్యూటీఫుల్ కపుల్ గా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. నమ్రత పెళ్లి అయ్యాక సినిమాలకు దూరంగా ఉండాలని ముందే డిసైడ్ అయిందంట. ప్రస్తుతం ఆమె అదే ఫాలో అవుతుంది. సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటి వ్యవహారాలను బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూ ఉంది.
ఇలా వారి లైఫ్ చాలా ఆనందంగా గడిచిపోతుంది. అయితే నమ్రత ఓ ఇంటర్వ్యూలో తమ పెళ్లి బంధం గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ నా హస్బెండ్ లేకుండా నేను నాలుగు గోడల మధ్య ఎన్ని రోజులైనా జీవించగలను. మా బంధం మధ్యలో ఇంకొకరు రాకుండా మేము చాలా సంతోషంగా గడుపుతాం. మా ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవు. నేనంటే ఏమిటో నా భర్తకు పూర్తిగా తెలుసు. అలాగే నా భర్త అంటే ఏమిటో నాకు పూర్తిగా తెలుసు. మా ఇద్దరి మధ్య అంత నమ్మకం ఉంటుంది. మా గురించి తెలుసుకోకుండా ఎవరు ఏదేదో మాట్లాడుతుంటారు. అయితే చాలామంది నా భర్త నేను చెప్పిన సినిమాలను చేస్తాడని అనుకుంటారు.
Mahesh Babu : షాకింగ్ కామెంట్స్ చేసిన నమ్రత…

కానీ దానిలో ఎటువంటి నిజం లేదు. ఎందుకంటే నా భర్త ఏ సినిమాలను చేయాలో, ఎవరితో చేయాలో అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. నా భర్త తీసుకున్న ఎటువంటి నిర్ణయమైనా నేను అడ్డు చెప్పను. ఆయనకి నచ్చినట్లుగా ఉండడానికి నేను ఓకే చెబుతాను. సినిమాల విషయంలో నేను ఏ రోజు ఆయనకి ఎదురు చెప్పలేదు అని నమ్రత చెప్పుకొచ్చారు. అలాగే మహేష్ బాబు సినిమాలతో బిజీగా ఉండడం వలన నమ్రత ఇంటికి సంబంధించిన బాధ్యతలను బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటుందంట. ఇప్పటికీ ఎంతో క్రేజీ ఉన్న ఈమె సినిమాలోకి రాకుండా పెళ్లికి కట్టుబడి ఇంటిని, పిల్లలను చూసుకుంటూ తన లైఫ్ ని సంతోషంగా కొనసాగిస్తున్నారు.