Rules of worship : హిందూ మతంలొ ప్రతి ఒక్కరు పూజకు మొదటి ప్రాదాన్యత ఇస్తారు. కొంతమంది అయితే తమ ఇష్టదైవం ను పూజించిన తర్వాత నే రోజు ను ప్రారంభిస్తారు. ఇలా చేసే క్రమంలో కొన్ని నియమాలు పాటిస్తే విజయాలు మీ సొంతం అవుతాయి. చిన్న చిన్న నియమాలు పాటించడం ద్వారా వాస్తు దోషాలను రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని వస్తువులు పూజ గదిలొ ఉంటే వెంటనే తీసివేయడం మంచిది. ఈ విదంగా దోషం కలిగించే వస్తువును తీసివేయడం ద్వారా దేవుని అనుగ్రహం పొందవచ్చు. పూజకు సంబంధించిన నియమాలు తెలుసుకుందాం.
మన ఇంటి పూజగదిలో చిత్రపటం పగిలినవి కాని చిరిగినవి కాని ఉండరాదు. ఇటువంటి చిత్రపటం ఎమైనా ఉంటే వెంటనే తీసివేయండి మరియు విరిగిన లేదా పగిలిన దేవుని విగ్రహలు పూజగదిలో ఉన్నా వెంటనే తీసీ వేయండి. ఇంటిలో ఉండే చిత్రఫటాలు చిరునవ్వుతో ఉండే విదంగా చూసుకోవాలి. కోపంగా ఉండే చిత్రపటం దోషంగా భావిస్తారు. పూజగదిలో ఉండే చిత్రఫటాలు సంఖ్య కూడా సరిసంఖ్యలో ఉండే విధంగా చూసుకోవాలి. అనగా 2,4,6,8 సంఖ్యలో ఉండాలి. బేసి సంఖ్యలో ఉండకుండా చూసుకోవాలి. చిత్రపటంల విషయంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

పూజగదిలో శివలింగంను పూజిస్తూ ఉంటారు శివలింగం విషయంలొ చాలా జగ్రత్తలు తీసుకోవాలి. శివలింగం నుండి శక్తి ప్రసరిస్తూ ఉంటుంది, కాబట్టి శివలింగం ఆరుబయట ఉంచి పూజిస్తారు ఒక వేళ పూజగదిలో శివలింగం ఉంటే బోటను వేలు పరియాణంలో వుండాలి మరియు ఒకటి కంటే ఎక్కవ సంఖ్యలో ఉండరాదు. పూజగదిలో శివలింగం ఉంటే కనుక శివుడు అభిషేక ప్రియుడు కావున ప్రతిరోజు శివలింగంకు అభిషేకం చేయాలి. సాదారణంగా ప్రతిరోజు అభిషేకం చేయలేము కాబట్టి శివలింగంను గుడిలో పూజించటమే మంచిది.ఈ విధంగా పూజ గది నియమాలు పాటించటం ద్వారా దేవుని అనుగ్రహం పొంది విజయాలు సాధించగలుగుతారు.