Samantha : అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఏం మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సమంత…ఆ తర్వాత మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా తెలుగులో వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకెళ్తోంది. అయితే మొదటి సినిమాతోనే నాగచైతన్యతో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత పెళ్లి చేసుకున్నారు. అంతేకాక సినీ ఇండస్ట్రీలో ఈ జంటకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. కానీ ఎవరు ఊహించని విధంగా పెళ్లైన కొన్నేళ్లకే అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం నాగచైతన్య మరియు సమంత విడివిడిగా ఒంటరి జీవితాలను గడుపుతున్నారు.
అయితే సమంత రెండో పెళ్లి చేసుకుని జీవితంలో సంతోషంగా ఉండాలని ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నప్పటికీ సమంత మాత్రం దీనికి అంగీకరించడం లేదట. మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన సమంతకు లేదట. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకుని మోసపోయానని మరోసారి అలాంటి తప్పు చేసే సమస్య లేదంటూ సామ్ తన ఫ్యామిలీకి చెప్పుకొస్తుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాక ఒంటరి జీవితాన్ని గడపడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది.
అయితే ఈ క్రమంలోనే సమంత ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుందట.తల్లి కావాలనే తన ఆశలు మాత్రం సమంత మరో విధంగా తీర్చుకోవాలని చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని వారితోనే సమంత తన జీవితాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఈ న్యూస్ నిజం అయితే సమంత తీసుకున్న నిర్ణయం గర్వించదగ్గ విషయమే అని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.