Health Benefits :బొప్పాయి పండు అంటే అందరికీ తెలిసిందే. ఈ పండు మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తుంది. బొప్పాయి లో ఉండే పోషక గుణాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. అదేవిధంగా శరీరానికి చాలా రకాల పోషకాలను అందజేస్తాయి. ఈ పండు కంటే గింజల్లోనే ఎక్కువ పోషకాలు లభిస్తాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. అయితే ఈ పండు గింజల వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పండు అన్ని సీజన్స్ లో లభిస్తుంది. బొప్పాయి పండుని తరచుగా తినడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది.
బాడీకి గింజల వల్ల అధిక శక్తి లభిస్తుంది. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల జలుబు ,దగ్గు వంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే గుణాలు బీపీ, షుగర్ వంటి సమస్యలను అధిగమిస్తుంది. ఈ పండుని రోజు తినడం వల్ల బద్ధక సమస్యలను దూరం చేస్తుంది. శరీర బరువును నియంతరిస్తుంది. బాడీలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండె సమస్యలను దూరం చేస్తుంది .అలాగే అధిక రక్తపోటును నియంతరిస్తుంది. జీర్ణా వ్యవస్థలో బ్యాక్టీరియాలను బయటకు పంపిస్తుంది. స్త్రీలలో పీరియడ్స్ రెగ్యులర్గా ఉండేటట్టు చేస్తుంది.
Health Benefits : బొప్పాయి గింజల తినడం వల్ల బరువు తగ్గవచ్చా?

ఈ పండు పురుషుల్లో సంతానం లేమి సమస్యలు తగ్గిస్తుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. మన బాడీకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండును కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తినడం వల్ల క్యాన్సర్ కణాలను కణతులను పెరగకుండా కాపాడుతుంది. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. బొప్పాయి పండు గింజల తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ గింజలను నేరుగా తినలేరు కాబట్టి వీటిని ఎండబెట్టి పొడి చేసి పండ్ల రసాలలో కలుపుకొని తాగవచ్చు. ఇలా తరచుగా తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి పండు దివ్య ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేశారు.