Ala Vaikunthapurramuloo : అల వైకుంఠపురంలో సినిమా చూశారా? ఆ సినిమాలో ఉన్న వైకుంఠపురం ఇల్లే చాలా ఫేమస్ అయింది. ఆ ఇంటికే ఒక చరిత్ర ఉంది. హీరో ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి చేయని ప్రయత్నాలు ఉండవు. చివరకు అదే తన ఇల్లు అని తెలుసుకున్నాక ఆ ఇంట్లో అడుగుపెడతాడు. అల వైకుంఠపురంలో సినిమాలోని ఇల్లు.. దాని రిచ్ నెస్ వల్లనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా 2020 లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

ఆ సినిమాలో ఉన్న వైకుంఠపురం అనే పెద్ద ఇల్లు నిజంగా ఎవరిదో తెలుసా? ఆ ఇంటిని చూసి అల్లు అర్జున్ కూడా ముచ్చటపడ్డాడట. ఇలాంటి ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడట. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిదంటే.. ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి కూతురు రచనా చౌదరి భర్తది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ ఓనర్ రాధాకృష్ణకు వాళ్లు బంధువులు. సినిమా షూటింగ్ కోసం రాధాకృష్ణ రిక్వెస్ట్ చేయడంతో షూటింగ్ కు ఇవ్వడానికి వాళ్లు ఒప్పుకున్నారట. అలా.. వైకుంఠపురంగా ఆ ఇల్లు మారిపోయింది.
Ala Vaikunthapurramuloo : ఆ ఇంటిని నిర్మించడానికి 100 కోట్లు ఖర్చయిందట
ఆ ఇంటిని సుమారు రూ.100 కోట్లతో నిర్మించారట. చాలా విశాలమైన భవనం అది. త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ వేరే దేశంలో ఏదైనా మంచి ఇంటిని సెలెక్ట్ చేసి అక్కడ షూట్ చేద్దామని అనుకున్నారట. కానీ.. రచనా చౌదరి వాళ్ల ఇల్లును చూసి ఇదైతే కరెక్ట్ సరిపోతుందని అనుకొని షూటింగ్ అనుమతి అడగడంతో వాళ్లు కూడా ఓకే చెప్పారట.

దీంతో అలా ఆ ఇల్లు అల వైకుంఠపురంగా మారిపోయింది. గేట్ బయటి నుంచి తీసిన షాట్స్ అని ఆ ఇంటివే. ఇంటీరియర్ కోసం మాత్రం అన్నపూర్ణ స్టూడియోలో రూ.5 కోట్లతో ఆర్ట్ డైరెక్టర్ మరో సెట్ ను వేయించారట. అలా అల వైకుంఠపురంలో ఇంటి సెటప్ పూర్తయిపోయిందన్నమాట.
మొత్తానికి సినిమాలో ఆ ఇల్లే హైలెట్ గా నిలిచింది. ప్రతి సారి హీరో ఆ ఇంటి ముందు నిలబడటం.. ఆ ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించడం లాంటి సీన్లు సినిమాకే హైలెట్ గా నిలిచాయి.