Viral Video : ప్రస్తుతం దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల వరద ప్రవాహం పెరుగుతోంది. చెరువులు, కుంటలు, నదులు ఉప్పొంగుతున్నాయి. భారీ వర్షాల వల్ల ఎక్కడ చూసినా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డు మీద వంతనెల మీది నుంచి కూడా వరద భారీగా ప్రవహిస్తోంది. దీంతో అటూ ఇటూ రాకపోకలు బంద్ అయిపోయాయి. చాలా చోట్ల రవాణా ఆగిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. కొందరు డేర్ చేసి తమ వాహనాన్ని వరద నీటిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా.. అవి వరదలో కొట్టుకుపోవడం.. అందులో ఉన్న వాళ్ల ప్రాణాలు పోవడం చూశాం.

తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. చంపావత్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడికి సమీపంలో ఉన్న కిరోడా బర్సాతి కెనాల్ వద్ద వరద ప్రవాహం పెరిగింది. రోడ్డు మీద ఉన్న వంతెన మీది నుంచి వరద ప్రవహిస్తోంది. అయినప్పటికీ.. బస్సు డ్రైవర్.. బస్సును పోనిచ్చాడు. అయితే.. ఆ వంతెనకు ఇరువైపుల ఎటువంటి గుర్తులు లేకపోవడంతో బస్సు డ్రైవర్ దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.
Viral Video : అదుపుతప్పి వరద నీటిలో కొట్టుకుపోయిన బస్సు
అయినప్పటికీ.. బస్సు వరద ఉదృతికి తట్టుకోలేకపోయింది. దీంతో వరద నీటిలో బస్సు కొట్టుకుపోయి బోల్తా పడింది. వెంటనే స్పందించిన స్థానికులు.. బస్సులోని ప్రయాణికులను రక్షించారు. అదృష్టవశాత్తు బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు.. జేసీబీ సాయంతో నీటిలో బోల్తా పడ్డ బస్సును బయటికి తీశారు. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
#Uttarakhand School bus washed away in floods due to heavy rainfall in #Champawat district. Watch viral video pic.twitter.com/JmegCHT5ow
— India.com (@indiacom) July 19, 2022