Business : ఫోన్ పే వాడితే ఈ చార్జీలను భరించాల్సిందే…

Business : ఇప్పుడు చాలామంది ఫోన్ పే, పేటియం లను వాడుతున్నారు. దాదాపు ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లో ఈ యాప్స్ అనేవి కచ్చితంగా ఉంటున్నాయి. అయితే చాలామంది పేటీఎం లేదా ఫోన్ పే ద్వారా మొబైల్ రీఛార్జ్ చేస్తుంటారు. అయితే ఇలా రీఛార్జ్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఫోన్ పే, పేటియం వంటి యూజర్ల నుంచి సర్ చార్జ్, ప్లాట్ ఫామ్ ఫీజు, కన్వీనియన్స్ ఫీజు వంటి వాటిని వసూలు చేస్తున్నాయి. మొబైల్ రీఛార్జ్ లేదా బిల్ పేమెంట్ వంటి వాటిపై ఈ చార్జీలు తీసుకుంటున్నాయి. అందువలన మీరు రీచార్జ్ చేసుకునే ముందు ఈ విషయాలను గమనించండి.

మీరు మొబైల్ రీఛార్జ్ చేశాక లేదంటే బిల్లు చెల్లింపు చేసిన తర్వాత మీరు ఈ విషయాన్ని గమనించకపోవచ్చు. అయితే ఈసారి మాత్రం బిల్లు పేమెంట్ లేదంటే రీచార్జ్ చేసినప్పుడు ఈ విషయాన్ని గమనించండి. ఫోన్ పే, పేటీఎం యాప్ సంస్థలు అదనపు చార్జీలను వసూలు చేస్తున్నాయి. రూ.2 వరకు చార్జీలు పడుతున్నాయి. ఫోన్ పే ద్వారా మొబైల్ ను రీఛార్జి చేస్తే ప్లాట్ ఫామ్ చార్జీల రూపంలో రూ. 1 నుంచి రూ.2 వరకు చెల్లించుకోవాలి. మీరు ఏ పేమెంట్ మోడ్ ద్వారా అయినా లావాదేవీ నిర్వహించిన ఈ ఫీజు పడుతుంది.

Business : ఫోన్ పే వాడితే ఈ చార్జీలను భరించాల్సిందే…

We use phone pay you will pay these charges
We use phone pay you will pay these charges

యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఫోన్ వాలెట్ఇలా మీరు ఎలా డబ్బులు చెల్లించిన ఫ్లాట్ ఫామ్ ఫీజు పడుతుంది. రూ. 100 మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే రూ. 101 చెల్లించుకోవాలి. అదే పేటీఎం విషయానికి వస్తే ఏకంగా రూ. 1 నుంచి రూ. 6 వరకు చార్జీలు చేస్తున్నాయి. మొబైల్ రీఛార్జ్ పై సర్ చార్జ్ రూపంలో పేటీఎం అదనపు చార్జీలను తీసుకుంటుంది. రూ. 6 వరకు ఈ భారం పడుతుంది. పేటియం వాలెట్, పేటీఎం పోస్ట్ పెయిడ్, యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇలా మీరు ఏ యాప్ నుంచి రీఛార్జ్ చేసుకున్న ఈ చార్జీలను తప్పనిసరిగా చెల్లించవలసిందే. అయితే అందరి యూజర్ల దగ్గరి నుంచి పేటిఎం ఈ చార్జీలను వసూలు చేయడం లేదు