Punugu Pilli Tailam : భూమి మీద ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. అందులో పునుగు పిల్లి కూడా ఒకటి. దీనిని ఇంగ్లీషులో టాడీ క్యాట్, సివియట్ క్యాట్ అని కూడా పిలుస్తారు. పునుగు పిల్లుల్లో దాదాపుగా 38 జాతుల వరకు ఉన్నాయి. అయితే ఆసియా రకానికి చెందినవి. ఈ పునుగు పిల్లుల్లో ఒక ప్రాముఖ్యత ఉంది. అది ఏమిటంటే ఈ జాతులకు చెందిన పునుగు పిల్లుల గ్రంథుల నుండి పునుగు తైలం అనే సుగంధ ద్రవ్యం లభిస్తుంది. ఈ తైలాన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహానికి రాస్తారు. ఈ పునుగు తైలం స్వామివారికి ఎంతో ఇష్టమైనదని కొందరు చెబుతుంటారు.
తిరుమలలో స్వామివారికి శుక్రవారం నాడు అభిషేకం చేసిన తరువాత మూల విరాట్ కు పునుగు తైలాన్ని లేపనంగా రాస్తారు. ఈ తైలం రాయడం వలన స్వామివారి విగ్రహం చెక్కుచెదరకుండా నిగనిగలాడుతూ ఉంటుందని పండితులు అంటున్నారు. పునుగు పిల్లికి రెండు సంవత్సరాల వయసు రాగానే రెండు రోజులకు ఒకసారి గంధం చెట్టుకు తన శరీరాన్ని రుద్దుతుంది. ఆ సమయంలో దీని చర్మం నుండి వెలువడే స్రవం ఆ చెట్లకు అంటుకుంటుంది. ఆ చెట్ల నుండి సేకరించి బడిన స్రావమే పునుగు తైలం.ఇప్పుడు ఈ పునుగు పిల్లులు అంతరించిపోతున్న వేళ తిరుమల తిరుపతి దేవస్థానం వారు వీటిని సంరక్షించి వాటి నుండి తైలాన్ని సేకరిస్తున్నారు.
Punugu Pilli Tailam : పునుగు పిల్లి తైలాన్ని తిరుమల శ్రీవారికి ఎందుకు రాస్తారో తెలుసా…?

అలాగే పునుగు పిల్లులు విసర్జించే కాఫీ గింజలకు మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది. పునుగు పిల్లులు బాగా పండిన కాఫీ గింజలను తిని కాఫీ గింజలను విసర్జిస్తాయి. ఈ కాపీ గింజలను సేకరించి పొడిగా చేసి అమ్ముతారు. ఈ కాఫీ పొడికి మార్కెట్లో కిలోకు రూ.20 వేల నుండి రూ.25 వేల వరకు ధర పలుకుతుంది. కాఫీ పండ్లను తిన్న వాటి పొట్టలో స్రవించే కొన్ని ద్రవాల కారణంగా కాఫీ గింజల్లో పోషకాలు మరింత పెరుగుతాయట. సివియట్ కాఫీని చాలా ఇష్టంగా తాగే వారు కూడా ఉన్నారు