Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ జీవితంలోని కొన్ని విషయాలు(Biography)

Rashmi Gautam : రష్మీ గౌతమ్ 1988 ఏప్రిల్ 27 న జన్మించింది. రష్మీ అమ్మగారిది ఒడిషా రాష్ట్రం లో ఉన్న బరంపుార్, నాన్నగారిది మధ్యప్రదేశ్.రష్మీ ఐదో తరగతి వరకు బరంపుార్ లొనే చదువుకుంది. అయితే రష్మీకి పదకొండేళ్ల వయసులో అమ్మ, నాన్న లు విడిపోవడంతో, రష్మీ అమ్మగారు రష్మిని తీసుకొని, వైజాగ్లో ఉంటున్న తాతయ్య, అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేశారు. ఆ తర్వాత వైజాగ్లో ఉన్న స్కూల్లో చదువుకున్నారు. అప్పటి వరకు తెలుగు రాకపోవడం, చదువు అంతా ఇంగ్లిష్ మీడియంలోనే కొనసాగడం, తెలుగుని తాతయ్యా, అమ్మమ్మ మాట్లాడుతూ ఉంటే నేర్చుకుంది. చిన్నప్పటినుండి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ముoదు ఉండి చేసేది, కానీ అదే తర్వాత యాంకరింగ్కి ఉపయోగపడుతుందని ఎప్పుడూ ఊహించలేదు. రష్మీ చిన్నప్పట్నుంచి, చాలా స్టైలిష్ గా ఉండేది. ఇంట్లో ఎవరూ అభ్యంతరం చెప్పేవారు కాదు. శ్రీదేవి గారంటే చాలా ఇష్టం. దాoతో రష్మీ తమ ఇంట్లో అద్దం ముందు నిలబడి శ్రీదేవి గారిని ఇమిటేట్ చేస్తూ ఉండేది. రష్మీ డిగ్రీ పూర్తి చేసింది.

ఇకపోతే వైజాగ్ లో కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ లొ పాల్గొన్నప్పుడు, అమ్మాయి బాగుందని డైరెక్టర్ శివ సినిమాల్లో నటించే ఉద్దేశం ఏమైనా మీకు ఉందా అని అడిగాడు. దానికి రష్మి వెంటనే ఓకే చేసింది. అప్పుడు వారు సవ్వడి అనే చిత్రాన్ని తీస్తున్నారు, ఈ విషయం చెప్పగానే ఇంట్లో వాళ్ళు కుాడా ఒప్పుకున్నారు. అయితే ఆ సినిమా కోసం ఒక్కతే వైజాగ్ నుంచి హైదరాబాదుకు వచ్చింది, సినిమా షూటింగ్ జరుపుకుంది. కానీ, ఆ సినిమా విడుదల కాలేదు, ఇక ఒకసారి సినిమా అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చిన తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లడం ఇష్టం లేక ఇక్కడే ఉంటుా సినిమా అవకాశాల కోసం తిరిగింది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఉదయ్ కిరణ్ నటించిన హొలి అనే సినిమాలో అవకాశం దక్కింది. ఈ సినిమాలో సునీల్ కు జోడీగా నటించింది. ఈ సినిమా తర్వాత రష్మిక పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు, మళ్లీ అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగింది.

Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ జీవితంలోని కొన్ని విషయాలు(Biography)

interesting facts about anchor Rashmi Gautam and her Biography
interesting facts about anchor Rashmi Gautam and her Biography

ఆ సమయంలోనే హాస్టల్ ఫీజు కట్టడానికి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.హాస్టల్ ఫీజు కోసం పార్ట్ టైమ్ జాబ్ కూడా చేసింది. ఈ సమయంలో యువ అనే సీరియల్లో నటించింది రష్మి, కాని తన లైఫ్ ని మార్చలేకపోయింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా సినిమా అవకాశాలు సంపాదించుకున్న తర్వాతే ఇంటికి వెళ్లాలి అని అనుకుంది. తర్వాత కరెంట్ సినిమాలో అవకాశం వచ్చింది. తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ఎన్ని సినిమాలు చేసిన రష్మి కి కావల్సిన గుర్తింపైతే రాలేదు.ఆ సమయంలో వైజాగ్ వెళ్లిపోతుంది.అప్పుడే ఈటీవీలో మల్లెమాల గారు జబర్దస్ అనే ఒక కామెడీ షో చెయ్యాలి అని, దానికి యాంకర్ గా కొoదరు రష్మీ ని,కొoదరు అనసూయ ని అనుకున్నారు.అప్పటివరకు రష్మి ఇండస్ట్రీలో హోస్ట్గా చెయ్యలేదు, అనసూయ కొన్ని షోస్ లో కనిపించింది. కాబట్టి అనసూయనే యాంకర్ గా ఉంచారు. కానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ తో కొన్ని గొడవలు జరగడం వలన తనను తొలగించారు అప్పటి నుంచి రష్మి యాంకర్ గా ఉంది.

అది సూపర్ హిట్ కావడంతో, శుక్రవారం రోజు కూడా ఎక్స్ట్రా జబర్దస్త్ అని స్టార్ట్ చేశారు.అయితే రెండు షోస్కి సేమ్ యాంకర్ ఎందుకు అని మళ్ళీ జబర్దస్త్ షోకి అనసూయను తీసుకుని వచ్చారు.సూదిగాడి సుధీర్ టీమ్, రష్మిని టార్గెట్ చేసి పంచులు వేయడంతో వాళ్ళ మధ్య ఎఫైర్ ఉందనే రూమర్స్ సోషల్మీడియాలో క్రియేట్ చేశారు. ఆ తర్వాత మల్లెమాల గారు నిర్వహించే డీ షోకి రష్మీ, సుధీర్ ని టీం లీడర్స్ గా తీసుకున్నారు. ఇక్కడ కూడా వీళ్ల జోడీ సుాపర్ హిట్‌ అయ్యింది. ఇక మల్లెమాల గారి ఒక ఈవెంట్స్లో కమెడియన్లు అందరూ కలిసి పెళ్లి చేయడంతో ఈ బంధం మరింత బలపడింది. అయితే వీళ్ళు షూటింగ్ టైంలో తప్ప ఇంకా వేరే టైంలో మాట్లాడుకోలేదు. తన లైఫ్లో సక్సెస్ వచ్చాక, తన ఫ్యామిలీ అందర్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది. ఇదే కాకుండా కరొనా టైంలో మూగజీవులకు కూడా ఎంతో హెల్ప్ చేసింది.తను జీవితంలో అనుభవించిన కష్టాలను, చేసిన మంచిని, ఈ మధ్యే బయోపిక్ లాగా, ఒక పర్ఫామెన్స్ రూపంలో శ్రీదేవి డ్రామా కంపెనీ లో చేసారు.ఇలా తను సక్సెస్ సాధించాలని, తన అభిమానులు ఆశిస్తున్నారు.