Sreemukhi : బుల్లితెరలో ఎప్పటినుంచో ప్రసారమవుతున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్. అప్పటినుంచి ఇప్పటిదాకా ఒకే రకమైన ఆదరణ అందుకుంటూ దూసుకెళ్లిపోతుంది. దీని ద్వారా భారీ స్థాయిలో టిఆర్పి రేటింగ్ రాబడుతుంది. ఈ కార్యక్రమానికి పోటీగా మరెన్నో కార్యక్రమాలు వచ్చినప్పటికీ అవన్నీ దీన్ని ప్రభావానికి తట్టుకోలేక మధ్యలోనే ఆగిపోయాయి. అంతలా ప్రతివారం సరికొత్త కంటెంట్ తో జబర్దస్త్ ప్రసారమవుతుంది. ఈ క్రమంలో ఈ మధ్యనే ఈ షో నుంచి యాంకర్ అనసూయ వెళ్ళిపోయింది. దాంతో రష్మీ యాంకర్ గా కొనసాగుతుంది.
జబర్దస్త్ ద్వారా కమెడియన్సే కాదు ఎందరో హీరోయిన్స్ కూడా తెలుగులోకి వచ్చారు. ఎందరికో లైఫ్ ఇచ్చింది. రష్మీ అనసూయ లాంటి వాళ్ళ కెరీర్ ను మలుపు తిప్పింది. అయితే జబర్దస్త్ లోకి యాంకర్ గా ఆఫర్ వచ్చినా మూడుసార్లు రిజెక్ట్ చేసింది ఓ యాంకర్. ఆమె ఎవరో కాదు శ్రీముఖినే. అనసూయ వెళ్ళిపోవటంతో జబర్దస్త్ నిర్వాహకులు మరో యాంకర్ శ్రీముఖిని సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. కానీ ఆమె ఈ షో కి ఒప్పుకోలేదు. దాంతో రష్మినే యాంకర్ గా సెటిల్ అయిపోయింది.
Sreemukhi : శ్రీముఖి జబర్దస్త్ యాంకర్ గా రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా…?

ఫుల్ ఫామ్ లో ఉన్న జబర్దస్త్ కార్యక్రమానికి శ్రీముఖి యాంకర్ గా ఎందుకు ఒప్పుకోలేదని అనుమానాలు వచ్చాయి. అందుకు కారణం శ్రీముఖి చేసిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదనే కారణం తెలుస్తుంది. ఏది ఏమైనా శ్రీముఖి జబర్దస్త్ కి యాంకర్ గా ఉంటే ఆ సందడే వేరేలా ఉంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. జబర్దస్త్ ద్వారా ఎంతోమంది టాలెంట్ వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో ఈ కార్యక్రమానికి జడ్జ్ లుగా వ్యవహరించిన రోజా, నాగబాబు కూడా మరింతగా హైలైట్ అయ్యారు. ఇక ఇందులో యాంకర్లుగా చేస్తున్న అనసూయ, రష్మీ కెరీర్ ఎదుగుదలకు జబర్దస్త్ కార్యక్రమమే మంచి ఆదరణ ఇచ్చిందని చెప్పుకోవాలి.