Mahesh Babu : పూరి జగన్నాథ్ కి మహేష్ బాబు మీద ఇంకా కోపం తగ్గలేదా, అందుకు కారణం గా పోకిరిని చూపిస్తున్న నటిజన్స్…

Mahesh Babu : మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కంబోలో వచ్చిన బిజినెస్ మాన్ మరియు పోకిరి ఎంత పెద్ద సక్సెస్ అయినాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీరి అభిమానులు మీరు కాంబినేషన్లో హ్యాట్రిక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకొని పోకిరి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్లలో 400 స్పెషల్ షో లను ప్రదర్శించడం జరిగింది. ఇంతవరకు ఏ హీరో సినిమాను ఇలా ప్రదర్శించడం జరగలేదు.అయితే పోకిరి సినిమా చుట్టూ ఇంతటి సందడి జరిగిన పూరీ జగన్నాథ్ మాత్రం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.

కనీసం మహేష్ బాబు బర్త్డే విషెస్ ని ట్విట్టర్ లో కానీ ఎక్కడా చెప్పినట్లు తెలియ రాలేదు. ఈ సినిమా గురించి ఎక్కడ చర్చలు కూడా పూరి జగన్నాథ్ జరగకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ మధ్యనే వీరు వీరి కాంబినేషన్లో జనగణమన అనే మూవీ ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ దీన్ని అధికారికంగా ఎప్పుడు చెప్పలేదు. అయితే దీనికి ప్రధాన కారణం వీరిద్దరి మధ్య విభేదాలు అని, దాంతో వీరి ఇరువురికి చాలా గ్యాప్ వచ్చిందని సినీవర్గాల లో వినికిడి. అయితే ఈ విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తోంది.

Mahesh Babu : పూరి జగన్నాథ్ కి మహేష్ బాబు మీద ఇంకా కోపం తగ్గలేదా

puri jagannadh angry on mahesh babu reason for angry
puri jagannadh angry on mahesh babu reason for angry

ఇలా ఉండగా పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో లేరు అని. ఇంకా కొందరు పూరి అందుబాటులో లేవకపోవడం వలన ఎటువంటి స్పందన ఆయన నుంచి రాలేదని అంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతం మహేష్ బాబు మరియు పూరి జగన్నాధ నాయకుల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న టైగర్ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి రానుంది. విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే కలిసి నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో పూరి జగన్నాథ్ చురుగ్గా పాల్గొంటూ బిజీగా ఉన్నారు.