Nayanathara : హీరోయిన్ నయనతార ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఉంది. ఇప్పటికీ నయనతారకి మంచి క్రేజ్ ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. నయనతార ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇష్టపడిన ప్రియుడిని పెళ్లి చేసుకొని హనీమూన్ కి కూడా వెళ్ళింది. కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎంటర్ అయిన నయనతార కెరీర్లో మొదట్లో ఒక్క సినిమా కూడా హిట్ కావడానికి చాలా తంటాలు పడ్డారు. మొదట్లో నయనతార హీరోయిన్ గానే చేయాలని ఏమీ అనుకోలేదు. తనకు నచ్చిన పాత్ర ఏదైనా సరే చేసి మెప్పించాలని ట్రై చేసింది. అందుకే ఇప్పుడు నయనతార సౌత్ లోనే టాప్ హీరోయిన్లలో ఒకరుగా పేరు సంపాదించుకుంది.
అయితే ఈ మధ్యనే తను ప్రేమించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ సెకండ్ హనీమూన్ కి కూడా వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. సెకండ్ హనీమూన్ ఖర్చులన్నీ ఓ ప్రముఖ సంస్థ భరిస్తుందని నయనతారకు విగ్నేష్ కు మ్యారేజ్ గిఫ్ట్ గా ఓ సంస్థ భారీ ఆఫర్ ని ఇచ్చిందని ఈ క్రమంలోనే వాళ్ళ హనీమూన్ ఖర్చులన్నీ ఆ ప్రముఖ సంస్థ భరిస్తుంది అంటూ కోలీవుడ్లో ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది. అయితే నయనతార తన భర్త గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాయి.

Nayanathara : ఆ విషయంలో మా ఆయన కింగ్…
సాధారణంగా ఏ భార్యకైనా తన భర్త హీరోనే, అది సెలబ్రిటీ అయినా సామాన్యులైన కానీ నయనతార తన భర్తని ఓ రేంజ్ లో పొగిడేసింది. ప్రస్తుతం ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నా కెరియర్ మొదట్లో నేను చాలామంది అబ్బాయిలను చూశాను. కొందరు నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. కానీ నా భర్త అయినా విగ్నేష్ శివన్ నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేశాడు. నా అందాన్ని కాదు, నా మనసుని ఇష్టపడ్డాడు. నన్ను నన్నుగా ప్రేమించాడు. అందుకే మా ఆయనని ఎప్పుడు నేను హర్ట్ చేయను. మా ఆయన బాధపడే పనులు ఎప్పటికీ చేయను. నన్ను అర్థం చేసుకోవడంలో మా ఆయన కింగ్ అంటూ నయనతార చెప్పుకొచ్చింది. ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.