Anasuya Bharadwaj : ఎవరి కోసం మారాలి.. అనసూయ లేటెస్ట్ పోస్ట్ వైరల్

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ అనే కన్నా… జబర్దస్త్ యాంకర్ అను అంటే అందరూ టక్కున గుర్తుకు తెచ్చుకునేది మన అనసూయ గురించే. అనసూయ అంటేనే బుల్లితెరకు రాణి. ఇప్పుడు సినిమాల్లోనూ తను నటిస్తోంది. ఒకప్పుడు బుల్లితెరలో టాప్ యాంకర్ గా వెలుగొందింది అనసూయ. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా తనే నెంబర్ వన్ అనుకోండి. అనసూయ కోసం, అనసూయనే యాంకర్ గా తీసుకోవాలని చాలా షో నిర్వాహకులు అనుకుంటారు. అను ఉంటే ఆ షోకు వచ్చే టీఆర్పీకి కొదవేం ఉండదు. కానీ.. ఇటీవల జబర్దస్త్ షో నుంచి అనసూయ తప్పుకున్న విషయం తెలిసిందే. తను తప్పుకున్న తర్వాత యాంకర్ రష్మీనే జబర్దస్త్ యాంకర్ గా ఉంది.

anasuya bharadwaj latest post on social media goes viral
anasuya bharadwaj latest post on social media goes viral

ఇక.. కొన్ని రోజుల నుంచి అనసూయ చేసే పోస్టులు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. లైగర్ సినిమా రిలీజ్ రోజు.. అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు అంటూ అనసూయ చేసిన ఓ ట్వీట్ అప్పుడు రచ్చ రచ్చ చేసింది. లైగర్ సినిమా ప్లాఫ్ అయిందని అనసూయ ఆ సినిమాపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. దీంతో అనసూయ మీద విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. ఏంటి ఆంటి నువ్వు అంటూ తనను ట్రోల్ చేశారు. బాడీ షేమింగ్ చేశారు.

Anasuya Bharadwaj : మీడియాపై విరుచుకుపడ్డ అనసూయ

అయితే.. తనపై తప్పు వార్తలు రాసే మీడియాపై అనసూయ ఆ తర్వాత విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. బాడీ షేమింగ్ చేస్తారా? నాపై తప్పుడు ప్రచారం చేసేలా వార్తలు రాస్తారా? సోషల్ మీడియాలో నన్ను ఆంటీ అంటారా అంటూ పలువురు నెటిజన్లు, మీడియాపై కేసులు పెడుతానంటూ అనసూయ మీడియా స్టేట్ మెంట్ ఇచ్చింది. అయినా కూడా తనపై ట్రోలింగ్ ఆగలేదు. అందరి పని చెబుతా. నా మీద నెగెటివ్ కామెంట్ చేసేవాళ్లను వదలను అంటూ సైబర్ క్రైమ్ లో కేసు పెట్టాను అని బెదిరించిన అనసూయ తాజాగా ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఎవరి కోసం మారాలి. ఎందుకు మారాలి. నువ్వు వేరే వాళ్లకు నచ్చేవిధంగా ఉండటం కోసం మారకు. నువ్వు నీలా ఉండు. నీలోని అసలు వ్యక్తినే సరైన వ్యక్తులు చూస్తారు. వాళ్లే నీ వెంట ఉంటారు అని అర్థం వచ్చేలా మోటివేషనల్ పోస్ట్ పెట్టింది అనసూయ. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మళ్లీ ఆ పోస్ట్ పై ఎటువంటి ట్రోల్స్ వస్తాయో వేచి చూడాల్సిందే.