Lakshmi Devi : మన తెలుగు ప్రజలు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. వారం మొత్తంలో రోజుకు ఒక దేవుణ్ణి కొలుస్తారు. కానీ మన హిందువులు లక్ష్మీదేవిని శుక్రవారం రోజున పూజిస్తారు. శ్రావణమాసంలో లక్ష్మీదేవికి ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. మహిళలు ఇలా శుక్రవారం రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని వ్రతాలు చేస్తారు. తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరిచి తల స్థానాన్ని ఆచరించి పసుపు కుంకుమలను ధరించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. కార్తీక మాసంలో లక్ష్మీ వ్రతం చేస్తారు.
ఈ అమ్మవారు అనుగ్రహం పొందిన వారు ఇంట సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ అమ్మవారిని ఎలా పూజించాలో తెలుసుకుందాం.
లక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం తప్పకుండా పూజించాలి. శుక్రవారం రోజున ఉప్పు నీటితో ఇంటిని శుభ్రపరచి పసుపు ,కుంకుమలను వస్త్రాలను ధరించాలి. శుక్రవారం రోజున దేవుడు ఫోటోలను ,పూజ సామాగ్రిని కదపకూడదు. ఆ తల్లిని ఎర్రటి మందార పూలతో పూజించాలి. ఇంట్లో గొడవలు లేకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. గడపను పసుపుతో పూజించి అలంకరించాలి. ఎప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచాలి.
Lakshmi Devi : శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని ఇలా పూజిస్తే చాలు… మీ ఇంట్లో ధనం, సంపద.

మనం పూజిస్తున్న అమ్మవారు ఎర్రటి వస్త్రాలతో పక్కన గజమహరాజులు, ధనాన్ని ఇస్తున్న అమ్మవారిని పూజించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే 11 శుక్రవారం ఉప్పు దీపం వెలిగించాలి. ఒక మట్టి మూకుడులో ఉప్పు వేసి దీపం దానిమీద వెలిగించాలి. ఇలా తప్పకుండా 11 వారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే దాన ధర్మాలు దానం చేస్తుండాలి. ఆకలి అన్న అనాధలకు పట్టాడు అన్నం పెట్టాలి. శుక్రవారం నాడు డబ్బులు ని అప్పుగా ఇవ్వకూడదు. ఇలా నియమ నిబంధనలతో అమ్మవారిని పూజిస్తే ఆ ఇంట ధన, సంపదలు కొరత ఏర్పడదు. ఇంత పేదవారైనా ఆ తల్లిని పూజిస్తే ధనవంతులు అవ్వాల్సిందే.