Health Tips : వీటిని పెరుగులో కలుపుకొని తినోద్దు… అవి ఏంటంటే.

Health Tips : చాలామంది పెరుగు తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. పెరుగు తినకపోతే కడుపు నిండినట్లుగా అనిపించదు. మన ఆరోగ్యానికి పెరుగు చాలా మేలు చేస్తుంది. అయితే పెరుగు కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వైద్యులు పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతుంటారు. పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు పరచడమే కాక రోగనిరోధక శక్తి కూడా అధికమవుతుంది. క్యాల్షియం పెరుగులో పుష్కలంగా లభిస్తుంది. పెరుగులో పొటాషియం, విటమిన్ బి 2, విటమిన్ బి12 ,మెగ్నీషియన్, ప్రోటీన్ కూడా అధికంగా ఉంటాయి. పెరుగులో పోషకాలు అధికంగా ఉండడం వల్ల దీనిని సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు.
ఎక్కువమంది కూరగాయలతో భోజనం చేసిన… చివరిలో రెండు ముద్దలు పెరుగుతూ తినకపోతే కడుపు నిండినట్లుగా అనిపించదు అని అంటారు. అయితే పెరుగుతో కలిపి కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

ఈ రోజుల్లో చాలామంది ఉల్లిపాయలను పెరుగులో నంజుకుని తింటారు. ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి హానికరమని ఆయుర్వేద నిపుణులు తెలియజేశారు. పెరుగు తినడం వల్ల దాని ప్రభావం చల్లగా ఉంటుంది మరియు ఉల్లిపాయలు తినడం వల్ల దాని ప్రభావం వేడిగా ఉంటుంది. ఇలా పెరుగు ఉల్లిపాయలు కలిపి తీసుకోవడం వల్ల అలర్జీ వచ్చే పెను ప్రమాదం ఉంటుంది. తామర సోరియాసిస్ గ్యాస్ దద్దుర్లు మరియు వాంతులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కారణం వల్ల పెరుగుతో కలిపి ఉల్లిపాయలను తీసుకోవడం మానేయండి.

Health Tips : వీటిని పెరుగులో కలుపుకొని తినోద్దు… అవి ఏంటంటే

Do not add them to his curd and eat them
Do not add them to his curd and eat them

పాల నుంచే పెరుగు తయారవుతుందని మనందరికీ తెలుసు. కానీ ఆయుర్వేద నిపుణులు ఈ రెండింటిని కలిపి తినడం నిషేధింపబడింది. పెరుగు మరియు పాలు కలిపి తినడం వల్ల కడుపునొప్పి, అతిసారం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పెరుగులో మామిడిని కలిపి తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు . ఇలా తినటం వల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చేపల కూర తిన్న తర్వాత పెరుగన్నం తినకూడదని అంటుంటారు. ఎందుకంటే ఒకేసారి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఇలా తింటే జీర్ణం, కడుపునొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి