Viral News : భూమిని తవ్వుతుండగా బయటపడ్డ ఒక అద్భుతం… అది ఏంటంటే…

Viral News : మన భారతదేశంలోని జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి అరుదైన ఘటనలు మన దేశంలో అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. ఈ అద్భుతాన్ని చూసి గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయారు. జమ్ము కాశ్మీర్ లో జిల్లాలో బుద్గామ్ జిల్లాలోని గుడ్ సథూ అనే గ్రామంలో కూలీలు రోజు లాగానే తమ పనుల్లో భాగంగా భూమి తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఓ కూలి ఓ చోట గడ్డపారతో భూమిని తవ్వుతుండగా అరుదైన విగ్రహం బయటపడింది.

వెంటనే ఆ కూలీలు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శిల్పాని స్వాధీనం చేసుకొని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆర్కియాలజీ, మ్యూజియంల శాఖ బృందాన్ని పిలిపించి విగ్రహాన్ని పరిశీలించగా ఆశిల్పం విష్ణుమూర్తిది అని తేలింది. ఈ విగ్రహం దాదాపు తొమ్మిదవ శతాబ్దానికి చెందినదని, దాదాపు 1200 సంవత్సరాల నాటిదని వారు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ శిల్పం మూడు తలలతో, నాలుగు చేతులతో ఉంది. విగ్రహం కూడి చేయి ఎగువ భాగంలో కమలం ఉంది.

Viral News : భూమిని తవ్వుతుండగా బయటపడ్డ ఒక అద్భుతం.

anciant old lord visnu idel found in jammu and kasmir
anciant old lord visnu idel found in jammu and kasmir

అదేవిధంగా బుద్గామ్ లోని కాగ్ ప్రాంతంలో కూలీలు పనిచేస్తుండగా మరొక శిల్పం బయటపడింది. దాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని పరీక్షించారు. అయితే ఆ శిల్పం పంచముఖ శకలమని అధికారులు తెలిపారు. ఈ రెండు శిల్పాలను కాశ్మీర్లోని ఆర్కియాలజీ మ్యూజియంల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ముస్తాక్ అహ్మద్ బేగ్ కు అందజేసినట్లు బుద్గామ్ సీనియర్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ తాహిర్ సలీం ఖాన్ తెలిపారు.