Viral News : మన భారతదేశంలోని జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి అరుదైన ఘటనలు మన దేశంలో అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. ఈ అద్భుతాన్ని చూసి గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయారు. జమ్ము కాశ్మీర్ లో జిల్లాలో బుద్గామ్ జిల్లాలోని గుడ్ సథూ అనే గ్రామంలో కూలీలు రోజు లాగానే తమ పనుల్లో భాగంగా భూమి తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఓ కూలి ఓ చోట గడ్డపారతో భూమిని తవ్వుతుండగా అరుదైన విగ్రహం బయటపడింది.
వెంటనే ఆ కూలీలు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శిల్పాని స్వాధీనం చేసుకొని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆర్కియాలజీ, మ్యూజియంల శాఖ బృందాన్ని పిలిపించి విగ్రహాన్ని పరిశీలించగా ఆశిల్పం విష్ణుమూర్తిది అని తేలింది. ఈ విగ్రహం దాదాపు తొమ్మిదవ శతాబ్దానికి చెందినదని, దాదాపు 1200 సంవత్సరాల నాటిదని వారు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ శిల్పం మూడు తలలతో, నాలుగు చేతులతో ఉంది. విగ్రహం కూడి చేయి ఎగువ భాగంలో కమలం ఉంది.
Viral News : భూమిని తవ్వుతుండగా బయటపడ్డ ఒక అద్భుతం.

అదేవిధంగా బుద్గామ్ లోని కాగ్ ప్రాంతంలో కూలీలు పనిచేస్తుండగా మరొక శిల్పం బయటపడింది. దాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని పరీక్షించారు. అయితే ఆ శిల్పం పంచముఖ శకలమని అధికారులు తెలిపారు. ఈ రెండు శిల్పాలను కాశ్మీర్లోని ఆర్కియాలజీ మ్యూజియంల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ముస్తాక్ అహ్మద్ బేగ్ కు అందజేసినట్లు బుద్గామ్ సీనియర్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ తాహిర్ సలీం ఖాన్ తెలిపారు.