Lakshmi Devi Pooja : ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం. చాలామంది సంపాదిస్తున్న డబ్బు నిలవడం లేదని నిరాశ చెందుతారు. మరికొందరు ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదని, వృధా అవుతుందని బాధపడుతుంటారు. అయితే సంపాదించిన సంపద నిలవాలంటే లక్ష్మీదేవి కటాక్షం మన పై ఉండాలి. డబ్బు సంపాదించాలన్న వచ్చిన డబ్బుస్థిరంగా ఉండాలంటే లక్ష్మీదేవికి ఎటువంటి ప్రసాదాన్ని సమర్పించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
డబ్బు సంపాదించాలని ఇంటిల్లిపాది ఎన్నో కష్టాలు పడుతుంటారు. కానీ వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు. ఎందుకంటే ఏదో ఒక విధంగా డబ్బు ఎక్కువ మొత్తంలో ఖర్చు కావడంతో ఆర్థికంగా వారు స్థిరపడలేక పోతారు. ఇలా డబ్బు నిలకడగా ఉండటానికి అనారోగ్య సమస్యలు వల్ల ఏర్పడ్డ ఖర్చులు తగ్గాలంటే లక్ష్మీదేవిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆరోగ్యంగా ,ఆర్థికంగా స్థిరపడతారు. ఇందుకోసం లక్ష్మీదేవిని ఎలా పూజించాలి… ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Lakshmi Devi Pooja : లక్ష్మీదేవికి ఈ ప్రసాదాన్ని సమర్పిస్తే…

ఇందుకోసం సోమవారం రోజున తల స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఆరు నుండి ఏడు గంటల సమయంలో పెరుగును చెక్క కవ్వంతో చిలిపి వెన్న తీయాలి. ఈ వెన్నెల తీయడానికి చెక్క కవ్వం మాత్రమే ఉపయోగించాలి. ఇలా తయారు చేసుకున్న వెన్నను జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. శుక్రవారం రోజున ఇంటిని ఉప్పు నీటితో శుభ్రపరచుకొని లక్ష్మీదేవిని పూజించాలి. సోమవారం రోజున తయారు చేసుకున్న వెన్నకు పొడిచేసిన బెల్లాన్ని కలిపి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. పూజ అయిపోయిన తర్వాత ఈ నైవేద్యాన్ని పిల్లలకు పంచి పెట్టాలి. ఇలా 11 వారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.
ఇలా చేయడం వల్ల సంపాదించిన డబ్బు నిల్వ ఉంటుంది. వృధా ఖర్చులు అనారోగ్య సమస్యలు దరిచేరవు. సంపాదించిన డబ్బు జాగ్రత్తగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంగా ఉంటారు. చేతికి రావాల్సిన ధనం వస్తుంది. అదేవిధంగా శుక్రవారం రోజున గోర్లు కోరుకోకూడదు. ఇతరులకు డబ్బు, బంగారం ఇవ్వకూడదు. ఇంట్లో ఉన్న ఆడపిల్లలను సంతోషంగా ఉంచాలి. శుక్రవారం అంతా పులుపు తినకుండా భక్తి శ్రద్దలతో లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఆయువు ఆరోగ్యాలు ,అష్టైశ్వర్యాలు మనకు లభిస్తాయి.