varalakshmi vratham : ఈ శ్రావణమాసంలో మహిళలు భక్తితో శ్రీలక్ష్మిని కొలుస్తారు. శ్రావణమాసం నెలలో రెండో వ శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. ఆ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని ఉప్పు నీటితో శుభ్రపరిచి, వాకిట్లో ముగ్గు పెట్టి, తలంటి, పసుపు కుంకుమలను ఆచరించి ఇంటి ఈశాన్యం మూలలో ముగ్గు వేస్తారు. పూజ మందిరంలోనే లక్ష్మీదేవి ఫోటో ను అలంకరించి రాగి చెంబులో నీరు, పసుపు, కుంకుమలు , పూలు,అక్షింతలు వేసి కలశాన్ని తయారుచేసి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచాలి.
తాంబూలంలో బియ్యం పోసి పసుపు కుంకుమలు ,పూలు వేసి ఈ తాంబూలంలో రాగి చెమ్మను పెట్టాలి. కలశంపై కొబ్బరికాయను ఉంచి ఎర్రటి రవిక బట్టతో దానిని అలంకరించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజిస్తూ అష్టోత్తర శతనామలతో అర్చన చేయాలి. తొమ్మిది రకాల పిండి వంటలు తయారు చేసి వీటితో పాటు పండ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తెల్లటి దారంతో తొమ్మిది రకాల పూలను కట్టి తోరణం తయారు చేసి పసుపు కుంకుమలను తో తోరణాన్ని అలంకరించి పూజలో ఉంచాలి.
varalakshmi vratham : వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకుంటే…

పూజ అయిన పిదప భర్త ఆశీర్వాదం పొంది ఈ తోరణాన్ని చేతికి కట్టించుకోవాలి. భక్తితో ప్రదర్శన పూర్వకంగా నమస్కారాలు చేసి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. సర్వమంగళ సంతృప్తి సకలాభీష్టం, పది కాలాలు సుమంగళిగా జీవించాలని మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. దక్షిణాదిలో వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో చేసుకుంటారు.
పద్ధతులు వేరైనా లక్ష్మీదేవిని పూజించే విధానం మాత్రం ఒకటే. కైలాసంలో ఏకాంతంగా ఉన్న సమయంలో పరమేశ్వరుని… పార్వతీదేవి స్వామి.. ఈ వ్రతాన్ని ఆచరిస్తే భూలోకంలో మహిళలు అష్ట ఐ శ్వర్యాలతో,సకల సౌభాగ్యాలు కలిగి ఉంటారో చెప్పమని కోరింది. అప్పుడు శివుడు వరలక్ష్మీ వ్రతాన్ని గురించి పార్వతీదేవికి చెప్పటం జరిగింది.
అందుకే శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం రోజున మహిళలంతా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. అమ్మవారికి పండ్లు, పిండి వంటలతో నైవేద్యాని సమర్పిస్తారు. పెళ్లి కాని కన్యలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనసుకు నచ్చిన వరుడు లభిస్తాడని నమ్మకం. ముత్తైదులు ఈ వ్రతం చేసేటప్పుడు మంగళసూత్రాన్ని వ్రతంలో ఉంచి పూజ అనంతరం తర్వాత ధరించడం వల్ల పది కాలాలు దీర్ఘసుమంగళీగా వర్ధిల్లుతారు.