
కొన్ని పుణ్యక్షేత్రాల్లోని మూల విరాట్ విగ్రహాలను ఫోటోలు తీయడం పూర్తిగా నిషేధం. భక్తులు ఆలయం లోపలికి వెళ్ళేముందే సెక్యూరిటీ సిబ్బంది పూర్తిగా తనిఖీ చేసి భక్తులను దేవాలయంలోకి అనుమతిస్తారు. భక్తులే కాదు ఆలయ పూజారులు కూడా దేవుడి సన్నిధిలోకి ఫోన్లను తీసుకెళ్ళరు. ఎందుకంటే మూల విరాట్ విగ్రహాన్ని ఫోటో తీయాలనే ద్యాసలో పడి దేవుడిని పూజించడంలో భక్తులు నిర్లక్ష్యం వహిస్తారని అందుకే ఫోన్లను ఆలయంలోకి అనుమతించరని చెబుతారు. అందుకే ప్రముఖ పుణ్యక్షేత్రాలైన TIRUMALA తిరుమల, కాణిపాకం , ఇంద్రకీలాద్రి , సింహాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో మూల విరాట్ విగ్రహాలను ఫోటో తీసేందుకు అనుమతించరు.
తాజాగా చిత్తూర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన KANIPAKAM TEMPLE కాణిపాకం వినాయకుడి మూల విరాట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. స్వయంభువుగా వెలసిన GANESH TEMPLE వినాయకుడి విగ్రహాన్ని ఫోటో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇది మదనపల్లి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి దంపతులు పనేనని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం కాణిపాకం వచ్చిన సందర్భంగా ఆ దంపతులు వారి అనుచరులతో కలిసి వరసిద్ది వినాయకుడిని దర్శించుకున్నారు. అయితే వారితోపాటు వచ్చిన వెంకట్ రెడ్డి అనుచరులు ఆలయం లోనికి ఫోన్లను వెంట తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
ఆ సమయంలోనే స్వామి వారి మూల విరాట్ విగ్రహాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని.. కాగా వారు ఫోటో తీస్తుంటే ఆలయ సిబ్బంది అభ్యంతరం ఎందుకు తెలపలేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఫేస్ బుక్ లో తీవ్ర దుమారం రేగింది. ఆలయ ఆచారాలను మంటగలిపారని ఇది ఆలయాధికారులు సిబ్బంది పని తీరు, సెక్యూరిటీ వైఫల్యం అంటూ విమర్శలు రావడంతో ఆ ఫోటోలను ఫేస్ బుక్ నుంచి డిలీట్ చేశారు.