Viral News : ఈ రోజుల్లో పిల్లలు మొబైల్స్ లో చూసి చేసే పనులు అరాచకంగా మారాయి. టెక్నాలజీ నీ పె చుకోవడం మంచిదే కానీ దానిని ఎలా ఉపయోగించుకోవడం అనేది చాలా అవసరం. ఇప్పుడు జరిగే చాలా విషయాలు సోషల్ మీడియాకి రోల్ పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. యూట్యూబ్ లో చూసి కొత్త కొత్త చేష్టలు చేయడం.. కొత్త కొత్త క్రైమ్స్ కి పాల్పడటం వంటివి కంటికి కనిపిస్తున్నాయి. 12 ఏళ్ల చిచ్చరపిడుగు ఊహించిన పని చేశాడు. యూట్యూబ్ లో చూసి ఏకంగా కల్తీ మద్యం తయారు చేశాడు.
లిక్కర్ తయారీకి ద్రాక్ష పండ్లను ఉపయోగించాడు. అయితే తయారు చేసిన మద్యాన్ని తాను తాగకుండా… స్నేహితుడితో తాపించాడు. అది తాగిన బాలుడు వెంటనే విరోచనాలు , వాంతులుతో హాస్పటల్లో చేరాడు. కేరళలో తిరువనంతపురం చిరాయిం కీజు లో గత శుక్రవారం రోజున ఈ సంఘటన జరిగింది. కల్తీ మద్యం తాగిన బాలుడు పరిస్థితి కుదితపడ్డట్టు తెలిసింది. బాలుడు తయారుచేసిన మద్యాన్ని కోర్టు పర్మిషన్ తీసుకొని… టెస్టింగ్ కోసం ల్యాబ్ కి పంపించారు.
Viral News : వీడు పిల్లోడు కాదు చిచ్చరపిడుగు.

ఈ బాలుడు తయారుచేసిన మధ్యలో ఇంకేదైనా ఆల్కహాల్ లేదా రసాయనాలు కలిపినట్లయితే కేసు ఫైల్ చేస్తామని పోలీసులు తెలియజేశారు. ఆ కల్తీ మధ్య తయారు చేసిన బాలుడు మాత్రం… ఇంట్లో తల్లిదండ్రులు తినేందుకు ఇచ్చిన ద్రాక్ష పళ్ళతోనే తయారు చేసినట్లు చెబుతున్నాడు. ఇందులో ఎటువంటి రసాయనాలు కలపలేదని వెల్లడించాడు. యూట్యూబ్ వీడియోలో చూసి తయారు చేశానని…. తరువాత కొన్ని గంటల పాటు మట్టిలో గుంత తీసి పాతిపెట్టినట్లు చెబుతున్నాడు. ఆ తరువాత తన స్నేహితుడితో తాపించాడని వివరించి చెప్పినాడు.