Anchor Shyamala : యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై సీరియల్స్, ప్రోగ్రామ్స్ ,వంట షోలు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉండేది. అప్పట్లో ఈమె బాగా ట్రెండ్ లో ఉంది. ఇక మధ్యలో బిగ్ బాస్ రెండో సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మధ్యలోనే బయటకు వచ్చింది. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. కానీ కౌశల్ ఆర్మీ దెబ్బకు ఎక్కువ రోజులు బిగ్ బాస్ లో ఉండలేకపోయింది. అలా శ్యామలకు బిగ్ బాస్ అంతగా ఉపయోగపడలేదు. కాకపోతే కొంతమంది ఫ్రెండ్స్ ఆమె లిస్టులోకి చేరారు. గీతామాధురి, శ్యామల, దీప్తి ఇలా వీరు గ్యాంగ్ లో ఉండేవారు. ప్రస్తుతం యాంకర్ శ్యామల సోషల్ మీడియాలో ఫుల్ హుషారుగా ఉంటుంది. తన యూట్యూబ్ ఛానల్, ఇంస్టాగ్రామ్, రీల్ వీడియోలు అంటూ అభిమానులను అలరిస్తుంది.
ఇక ఫ్రీ రిలీజ్ ఈవెంట్లతోనూ శ్యామల బాగానే సంపాదిస్తుంది. ఓ సినిమా రిలీజ్ ఈవెంట్లో యాంకర్ శ్యామల మీద ఆర్జీవి కన్ను పడింది. ఇంత అందమైన యాంకర్ నా కంట ఎందుకు పడలేదు అంటూ శ్యామలాను స్టేజ్ మీదే పొగిడేసాడు ఆర్జీవీ. అలా శ్యామల మరోసారి వర్మ కారణంగా బాగా ట్రెండ్ అయిపోయింది. అంతకుముందు శ్యామల చుట్టూ కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి. ఆమె భర్త ఓ మహిళను మోసం చేశాడని కోటి రూపాయలు ఎగ్గొట్టాడంటూ కేసులు పెట్టారు. దీంతో శ్యామల చుట్టూ వివాదాలు అల్లుకున్నాయి. కానీ వాటి నుంచి ఇప్పుడు ఆమెకి ఉపశమనం కలిగినట్టుంది. ఇక తన కొడుకు ఇషాన్ గురించి చెబుతూ ఆమె వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది.
Anchor Shyamala : రాను రాను అంటూనే చిన్నదో… అంటూ తెగ నడుముని ఊపేసిన యాంకర్ శ్యామల…

యూట్యూబ్ ఛానల్ లో శ్యామల చేసే వీడియోలు, చెప్పే విషయాలు, వంటగది సంగతులు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక ఈమె చేసే రీల్ వీడియోలు అందులో ఆమె డ్రెస్సింగ్ డ్యాన్స్ వేసేటప్పుడు స్టెప్పులు ఎక్కువగా ట్రెండ్ అవుతాయి. ప్రస్తుతం నితిన్ నటించిన ‘ మాచర్ల నియోజకవర్గం ‘ లోని రాను రాను అంటూనే చిన్నదో అనే పాట ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఈ పాటలో అంజలీ, నితిన్ వేసిన స్టెప్పులు లను రీల్ వీడియోలుగా చేస్తున్నారు. తాజాగా శ్యామల కూడా ఆ పాటకు డాన్స్ వేస్తూ తన నడుమును తెగ ఊపేసింది. రాను రాను అంటూనే చిన్నదో అంటూ శ్యామల స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.