Guppedantha Manasu 22 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 22-September-2022 ఎపిసోడ్ 562 ముందుగా మీకోసం. వసుధార కాలేజ్ బోర్డు పైన రిషి సార్ వస్తారా, రారా అని రాస్తూ ఉంటుంది. ఇంతలో రిషి వచ్చి కూర్చో వసుధార అని చెప్పి వసుధార తో మాట్లాడుతూ ఉంటాడు. మన ప్రేమ కోసం నా కోపాన్ని పక్కకు పెట్టుకున్నాను కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి వసుధార నువ్విచ్చిన గురుదక్షిణ మాట మర్చిపోవాలి మన ప్రేమ కోసం, నాకు తెలుసు నీకు ఇది కష్టంగా ఉంటుంది కానీ, మన ప్రేమ కోసం నువ్వు చెయ్యాలి అని అనడంతొ వసుధార ఏడుస్తూ ఉంటుంది, తన కళ్ళల్లో కన్నీళ్ళు తుడుస్తూ ఇది మన ప్రేమ కోసం చెయ్యాలి అని చెప్పి వెళ్లిపోతాడు. రిషి సీసీటీవీ ఫుటేజ్ని సంపాదిస్తాడు కాలేజ్లో, ఆ తర్వాత వసుధార రూమ్కి ధరణి ఏదో కవర్ తీసుకుని వచ్చి, కొద్దిసేపు మాట్లాడుతూ ఉంటుంది, ఇంతలో తనకి దెబ్బ తగలడంతో ధరణిని తీసుకొని రిషి వాళ్ల ఇంటికి బయలుదేరుతారు, దేవయాని అసలీ దెబ్బ ఎందుకు తగిలింది, ఆయన దెబ్బతగిలిన చోటు నువ్వేం చేస్తున్నావని వసుధారని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.
ఇలా కొద్దిసేపు తర్వాత రిషి మహేంద్రకి క్షమాపణ చెప్తూ ఉంటాడు, తను కోపంలో మాట్లాడాను అని, ఏం పర్వాలేదు అని మహేంద్ర అంటాడు.యాక్సిడెంట్ జరిగిన ధరణిని తీసుకుని ఇంటికి రావడంతో, వసుధార కూడా రిషి వాళ్ల ఇంట్లోనే ఉంటుంది, ఇంతలో సాక్షి వస్తుంది అక్కడికి, దేవయాని ఏంటి చెప్పకుండా వచ్చావు సాక్షి అని అనగానే, అదేంటి అంటీ రిషినే కదా నన్ను రమ్మన్నది ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని పిలిచాడు అని అంటుంది. ఇంతలో రిషి వచ్చి, అవును పెద్దమ్మ నేనే రమ్మన్నాను, మీరు నాతో చెప్పారు కదా, వసుధారని నేను ప్రేమిస్తున్న విషయం మీతో చెప్పినప్పుడు, సాక్షి నన్ను ఎక్కువగా ప్రేమించింది అని, సాక్షి నా ప్రేమ కోసం ఏదైనా చేస్తుంది అని, దాని గురించి మాట్లాడదామని పిలిపించాను అని రిషి అంటాడు. దాంతో దేవయాని వసుధార తో గొడవ జరిగింది కాబట్టి సాక్షికి దగ్గరవుతున్నాడా అని సంతోషపడుతూ ఉంటుంది. రిషి వాళ్ల పెద్దనాన్న ఏం జరుగుతుంది రిషి అని అనడంతో, ఆగండి పెదనాన్న మీకే చూపిస్తాను అని, రిషి సీసీటీవీ ఫుటేజ్ని కుటుంబ సభ్యుల అందరి ముందు చూపిస్తూ ఉంటాడు, వసుధారని కిడ్నాప్ చేయించింది సాక్షి అని అందులో ఉంటుంది.
Guppedantha Manasu 22 September 2022 Episode : సాక్షి బండారం బయటపడనుందా?

దాంతో కుటుంబ సభ్యులు అందరూ షాక్ అవుతూ చూస్తారు సాక్షి వైపు, దేవయాని ఏమీ తెలియనట్టు ఏంటి సాక్షి ఇదంతా నిజమా, నువ్వు ఇలా చేస్తావా అని అడుగుతుంది. జగతి సాక్షి దగ్గరికి వచ్చి ఒక స్టూడెంట్ జీవితంతో ఆడుకొంటావా అని తన చెంప పగలగొడుతుంది, అందరూ సాక్షిని ప్రశ్నిస్తారు, నువ్వు చేసిన పని కారణంగా వసుధార ప్రాణాలకే ప్రమాదం కలిగే పరిస్థితి వచ్చింది, ఆ రోజు ఇంకెలాగో తనకి స్పృహలోకి వచ్చి ఎగ్జామ్ రాయగలిగింది, ఒకవేళ ఎగ్జామ్ కూడా రాయకపోతే తన కెరియర్ నాశనం అయ్యుండేది, ఇదంతా జరగడానికి కారణం నువ్వే అని, రిషి నేను డీబిఎస్టీ కాలేజ్ ఎండీగా నిన్ను ఒక స్టూడెంట్ జీవితాన్ని నాశనం చెయ్యడానికి ప్రయత్నించినందుకు అరెస్ట్ చేయిస్తాను అని అంటాడు. దాంతో ఒక్కసారిగా షాకైన సాక్షి అస్సలు కిడ్నాప్ చేయమని చెప్పింది దేవయాని అన్న నిజాన్ని, ఎలాగైనా వసుధారాని ఎగ్జామ్ రాయకుండా చేస్తేనే రిషి వసుధార మీద కోపంతో దూరం అవుతాడు, ఎలాగైనా ఈ అవకాశాన్ని వదులుకోవద్దని తనే పథకం పన్నిన విషయాన్ని, కుటుంబ సభ్యుల ముందు చెబుతుందా లేదా అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది.