Intinti Gruhalakshmi 5 September Today Episode : తులసిని ఎలాగైనా ఆఫీస్ కి వచ్చేలా ఒప్పించమని నందు లాస్యకి చెప్పిన సామ్రాట్, నందు తులసిని ఒప్పించగలడా?

Intinti Gruhalakshmi 5 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 5-September-2022 ఎపిసోడ్ 729 ముందుగా మీ కోసం సామ్రాట్ ఆఫీస్లో కోపంగా కూర్చొని, తులసి పంపిన మెసేజ్ ని చూస్తూ ఉంటాడు. వల్లభాబాయ్ వచ్చి ఈ రోజు మీటింగ్ ని క్యాన్సిల్ చేయమని చెప్పావు ఎందుకు అని అడుగుతాడు. దానికి సామ్రాట్ కోపంగా ఏదో సమాధానం చెబుతాడు. ఇంతలో నందు, లాస్య అక్కడికి వస్తాడు. లాస్య, నందు తొ క్షమాపణ చెప్పడానికి వచ్చి, సైలెంటుగా ఉన్నావేoటి అని అనగానే, సామ్రాట్ దేనికి క్షమాపణ అంటాడు. దీపక్ తో గొడవపడ్డoదుకు సార్ అని అంటాడు నందు.మీకు నిజం తెలుసు అని అనుకున్నాం సార్, తులసితో కూడా ఎన్నోసార్లు చెప్పమని చెప్పాము కానీ చెప్పలేదు అని, ఇద్దరు తులసీపైనే చాడీలు చెబుతూ ఉంటాడు. మీ పర్సనల్ విషయాలన్నీ నాకు అనవసరం, బిజినెస్ పార్టనర్షిప్ తులసి ఎందుకు క్యాన్సిల్ చేసింది. తను నా ఇగో మీద కొట్టింది, మెసేజ్ పెట్టి కనీసం ఎక్స్ ప్లనేషన్ కూడా ఇవ్వలేదు అని కోపంగా ఉంటాడు.నా పరువు పోతుంది.

Intinti Gruhalakshmi 5 September Today Episode : తులసిని ఎలాగైనా ఆఫీస్ కి వచ్చేలా ఒప్పించమని నందు లాస్యకి చెప్పిన సామ్రాట్.

మీరే ఎలాగైనా దాన్ని సరిదిద్దాలి అని అంటాడు. మీరు చెప్పండి సార్ చేస్తాము అని వీళ్లు అనగానే, తులసిని ఎలాగైనా ఒప్పించండి అని అంటాడు వాళ్లతో, ఓకే సార్ అని చెప్పి వెళ్లిపోయారు.బయటికి రాగానే నందు లాస్య తో ఏంటి ఇలా చేశాడు సామ్రాట్ అని అనగానే, ఇప్పుడు మన దగ్గర ఆప్షన్ లేదు, అబద్ధం చెప్పి అయినా సరే తులసిని ఒప్పిద్దాం, తను వెళ్లాక, మనం బాధపడి నిజం చెప్పాము సామ్రాట్ గారికి అని, సామ్రాట్గారూ తనని వెంటపెట్టుకొని రమ్మన్నారు అని చెప్పి తీసుకొద్దాం అని లాస్య అంటుంది. ఇద్దరూ బయలుదేరుతారు, నందు వాళ్ళ అమ్మ చుాసి, ఇంకా ఏ మొహం పెట్టుకొని వచ్చారు, అమ్మ అడక్కడక్క ఒక కోరిక అడుగుతే తీర్చావా అని అంటోంది. అమ్మ నువ్వు చెప్పినట్టే చేశాను అని, ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు ముగ్గురు,మీరే మాట్లాడుకోండి తులసితో అని నందు వాళ్ళ అమ్మ చెబుతుంది.

Intinti Gruhalakshmi 5 September Today Episode
Intinti Gruhalakshmi 5 September Today Episode

నందు, వాళ్ళ నాన్న తొ మాట్లాడటానికి ప్రయత్నిస్తే, తులసితోనే మాట్లాడమని చెబుతాడు. తులసి దగ్గరికి వెళతారు నందు, లాస్య ఇద్దరు.నందు సామ్రాట్ గారిని ఒప్పించాం అని అనగానే, తులసి దివ్యని పిలిచి, మీ కూతురి మీద ప్రమాణం చేసి చెప్పండి. మీరు నిజం చెప్పారా, లేక పోతే ఒప్పించారా అని అంటుంది. రెండింటికీ తేడా ఏముంది తులసి అని నందు అంటాడు. తేడా ఉంది అని అంటుంది. ఇలా కొద్దిసేపు మాట్లాడుతూ ఉంటారు.నాకు ఆత్మాభిమానం ముఖ్యము, నేను ఆఫీస్కి ఇక రాను అని చెప్పండి, అని చెప్పి వెళ్ళిపోతుంది తులసి.నందు ఆలోచిస్తూ ఉంటాడు, సామ్రాట్ చెప్పిన మాటల్ని, తులసి ఎలాగైనా రావాలి లేకపోతే, మీరు ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదు అని సామ్రాట్ అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంతలో లాస్య వచ్చి, ఏమైంది నందు అని అడుగుతుంది. సామ్రాట్కి ఇగో ప్రాబ్లం, తులసికి అంతకంటే ఎక్కువ ఇగో ప్రాబ్లం అని అంటూ ఉంటాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.