Nagachaithanya : ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాలో హీరో హీరోయిన్లుగా సమంత, నాగచైతన్య నటించారు. ఈ సినిమా మంచి హిట్ ను సంపాదించుకుంది. ఈ సినిమా సక్సెస్ తర్వాత సమంత, నాగచైతన్య ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ళు హ్యాపీగా జీవనం సాగించిన వీరిద్దరూ కొన్ని కారణాల వలన గతేడాది విడాకులు తీసుకున్నారు. ఈ విషయంపై అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. రకరకాల కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వీరిద్దరిని బాగా హైప్ చేశారు. సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారం ఎన్నో రోజులు వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది.
వీరిద్దరి విడాకుల విషయం తెలుగు పరిశ్రమలోనే కాదు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా హార్ట్ టాపిక్ గానే ఉంది. సమంత, నాగచైతన్య విడిపోయి నెలలు గడుస్తున్న వీరిద్దరి రిలేషన్, సెపరేషన్ పై వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు విడాకుల విషయంపై పెద్దగా నోరు విప్పని చైతు ‘ లాల్ సింగ్ చెడ్డా ‘ సినిమా ప్రమోషన్స్లో కొన్ని ఆసక్తికర కామెంట్లను చేశాడు. ఆ సినిమా ఇంటర్వ్యూలో సమంతపై తనకి ఇప్పటికీ గౌరవం ఉందని చెప్పుకొచ్చాడు.
Nagachaithanya : సమంత గురించి ఇలా చెప్తూ… బాధను వ్యక్తపరిచిన చైతూ…

నాగచైతన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే ‘ లాల్ సింగ్ చడ్డా ‘ చేయబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్లో విడాకుల గురించి కాకుండా కొత్తగా సమంతపై మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ ప్రశ్నించాడు. దానికి బదులుగా చైతూ సమంత అంటే ఇప్పటికి తనకు అమితమైన గౌరవం ఉందని, అది ఎప్పటికీ అలానే ఉంటుంది, ఇష్టప్రకారంగానే విడాకులు తీసుకున్నామని, ఆ సమయంలో కూడా మా ఇద్దరికీ ఒకరిపై ఒకరికి రెస్పెక్ట్ ఉందని తెలిపారు. కానీ అప్పుడప్పుడు అంతకుమించి ఎటువంటి గొడవలు జరగలేదు. కానీ మా ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని చెప్పేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. అలా చేస్తుంటే నేను చాలా బాధపడ్డాను అని చైతన్య తెలిపారు.