Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో ‘ స్టూడెంట్ నెంబర్ వన్ ‘ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ సినిమా హిట్ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాజమౌళి వరుసగా సినిమాలను సూపర్ డూపర్ హిట్ గా దర్శకత్వం వహిస్తూ వస్తున్నారు. అభిమానులు రాజమౌళి సినిమా అంటే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అంతలా అభిమానుల మనసులో చోటు సంపాదించుకున్నాడు రాజమౌళి. ఇప్పటివరకు రాజమౌళి తీసిన అన్ని సినిమాలు హిట్ లు గానే మిగిలాయి.ఈ మధ్యనే రెబల్ స్టార్ ప్రభాస్ తో బాహుబలి సినిమాను చేసి ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపును పొందారు.
బాహుబలి సినిమాలో సాంకేతికతనే కాదు వసూళ్ల పరంగానూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా కూడా అటువంటి అంచనాలను అందుకుంది. తెలుగు సినిమాకు గర్వకారణంగా నిలిచిన రాజమౌళికి ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పుడు ఆయన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 లో భాగం కాబోతున్నారు. దీన్ని స్వయంగా టిఫ్ నిర్వాహకులు తెలియజేశారు. హాలీవుడ్ ప్రముఖులతో రాజమౌళి చర్చా వేదికలో పాల్గొన్నారు. టొరంటోలో సెప్టెంబర్ 8 నుంచి 13 వరకు ఈ అవార్డు వేడుకలు జరగబోతున్నాయి.
Rajamouli : దర్శకధీరుడికి అరుదైన గౌరవం…

రాజమౌళి తెలుగు సినిమాను మేకింగ్ పరంగా సాంకేతిక పరంగా మరో స్థాయికి తీసుకెళ్లారు .ఆయన గత చిత్రం ‘ ఆర్ఆర్ఆర్ ‘ కూడా 1200 కోట్లను వసూలు చేసింది. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో మరో భారీ బడ్జెట్ సినిమాను చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ అధినేత కే ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి ఈ కథను సిద్ధం చేస్తున్నారు. సినీ పరిశ్రమలో సమాచారం ప్రకారం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కించేలా కథను రెడీ చేస్తున్నారట.