Life Style : రాత్రి సమయంలో ఇటువంటి ఆహారం తిన్నారంటే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Life Style : మన ఆరోగ్యం మనం తినే ఫుడ్ పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే తినే ఆహారం పట్ల కాస్త జాగ్రత్తలు వహించాలి. అయితే రాత్రి సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద ప్రకారం రాత్రి సమయంలో తేలికపాటి ఆహారాన్ని తినడం మంచిది. అలాగైతేనే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. హాయిగా నిద్ర పడుతుంది. అయితే రాత్రి సమయంలో కొన్ని రకాల ఆహారాలను తినకూడదు. ఎందుకు తినకూడదంటే. చికెన్ బిర్యాని, మటన్ బిర్యానీ వంటివి రాత్రి ఏడు గంటల వరకు తినాలి. ఎందుకంటే వీటిలో కొవ్వు క్యాలరీలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

కాబట్టి ఇటువంటి ఆహారాలు రాత్రి సమయంలో తీసుకుంటే కడుపులో వికారంగా, గ్యాస్ వంటి సమస్యలతో నైట్ నిద్ర సరిగా పట్టదు. మన తెలుగువారి వంటల్లో తప్పనిసరిగా మసాలా దినుసులు లేకుండా వంటలే పూర్తి కావు. రాత్రిపూట ఇటువంటి మసాలా ఆహారం తినడం వల్ల కడుపులో మంట, చాతిలో మంట పుడుతుంది. అంతేకాకుండా ఇటువంటి వంటకాలను ఎక్కువ నూనె లేదా నెయ్యితో తయారుచేస్తారు. దీని కారణం వల్ల గుండె జబ్బులు అధికమవుతాయి. అందుకే ఘాటుగా తయారు చేసిన ఆహార పదార్థాలను రాత్రి సమయంలో ఏడు గంటల దాటిన తర్వాత తినడం మానేయండి. చాలామంది స్వీట్ లను తినడంపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

Life Style : రాత్రి సమయంలో ఇటువంటి ఆహారం తిన్నారంటే..

Do you know what happens if you eat such food at night
Do you know what happens if you eat such food at night

నైట్ భోజనం తర్వాత స్వీట్ తింటే తిన్న ఆహారం త్వరగా అరుగుతుందని వంటి కారణంతో స్వీట్లు లాగిస్తారు. అయితే స్వీట్లు రాత్రి సమయంలో తినడం వల్ల అధిక బరువు పెరిగి అనారోగ్య సమస్యలకు గురి అవుతారు. సాయంత్రం సమయంలో స్నాక్స్ టైం కాగానే ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తుంది. శనగపిండితో చేసిన పకోడీలను చూస్తే నోట్లో నీరు పోతాయి. ఎంత టేస్టీగా ఉన్నా పకోడీలను రాత్రి 7 గంటల తర్వాత తినకూడదు. ఎందుకంటే ఈ పకోడీలలో ఎక్కువ క్యాలరీల శక్తి ఉంటుంది. కాబట్టి కడుపులో చికాకు గురిచేస్తాయి. ఎందుకంటే పకోడీలను నూనెలో వేయించడం వల్ల ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి.

మీరు రాత్రి పూట అధిక ఆమ్లాలను కలిగి ఉన్న ఆహారాలను తింటే అవి అంత త్వరగా జీర్ణం కావు. దీనివల్ల మీకు రాత్రి పూట నిద్ర ఉండదు. మరికొందరు భోజనం తినే టైంలో కాఫీ, టీ ,గ్రీన్ టీలు వంటివి తాగుతారు. కానీ వీటిని రాత్రిపూట తాగడం వల్ల నిద్ర పై ఎఫెక్ట్ పడుతుంది. అనారోగ్య సమస్యలు కూడా గురి అవుతారు. కాబట్టి ఇటువంటి పానీయాలను రాత్రి 7 గంటల తర్వాత తాగడం మంచిది కాదు. వీటికి బదులుగా ఏమైనా జ్యూసులు తాగడం మంచిది.