Health Care : ప్రస్తుతం చాలామంది డయాబెటిస్, హై బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా అస్సలు తగ్గడం లేదు. అయితే ఒక్కసారి డయాబెటిస్, హైబీపీ వచ్చాయంటే జీవితాంతం వరకు ఉంటాయి. అయితే ఇవి రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులను కనుక తింటే షుగర్ లెవెల్, బిపి లెవెల్ అందుబాటులో ఉంటాయి. ఆసుపత్రిలో బిల్లును నుంచి విముక్తి పొందాలంటే రోగాల బారి నుంచే విముక్తి పొందాలంటే ఇంతకంటే మంచి మార్గం మరొకటి ఉండదు. అయితే ఈ ప్రధానమైన మూడు రకాల ఆకులను ఉదయాన్నే పరిగడుపున తింటే కనుక ఎలాంటి రోగాలు దరి చేరవు.
తులసిని మూలికల రాణి అని పిలుస్తారు. ఇది మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. తులసి ఆకులను పరిగడుపున తీసుకోవడం వలన ఎంతో మంచి జరుగుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. తులసిని ఔషధాలలో ఎక్కువగా వినియోగిస్తారు. అలాగే ప్రతి భారతీయ వంటల్లో ఉపయోగించే ఒక సాధారణ పదార్థం కరివేపాకు. ఇది కూడా అనేక ఆరోగ్య లక్షణాలను కలిగి ఉంటుంది. కరివేపాకును తప్పకుండా తీసుకోవడం వలన ఇన్సులిన్ తయారు చేసే కణాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కరివేపాకు సహాయపడుతుంది.
అలాగే వేపాకులలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రతిరోజు వేపాకులను తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి. డయాబెటిస్ ఉన్నవారు వేపాకు వారి దినచర్యలో భాగంగా చేసుకోవాలి. ఇక ఒక 5 వేపాకులు, 5 కరివేపాకు ఆకులు, ఐదు తులసి ఆకులు ఈ మూడింటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే చాలా మంచిది. వీటిని క్రమం తప్పకుండా తింటే చాలా వ్యాధుల బారి నుంచి రక్షించబడతారు. ఇవి హానికరమైన బ్యాక్టీరియా నుండి రక్షిస్తాయి అని వైద్యశాస్త్రం చెబుతుంది.