Diabetes patient : ఖర్జూర పండ్లను పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. ఇది స్వీట్ గా ఉండి రుచిని పెంచడమే కాకుండా శరీర ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఐరన్, మెగ్నీషియం ,పొటాషియం వీటిలో అధికంగా ఉంటాయి.
కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇవి చక్కటి పరిష్కారాన్ని చూపుతాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంతరించడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే వీటిని రోజు తినడం వల్ల శరీరానికి సంభవించే వ్యాధులను రాకుండా అరికడుతుంది. అయితే ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం… రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది….
వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనిలో మూ లికాలు అధికంగా ఉండడం వల్ల శరీరంలో ఉన్న చక్కెర స్థాయిలను నియంతరిస్తుంది. అయితే రోజు నాలుగు నుంచి ఐదు ఖర్జూరాలు తీసుకోవడం వల్ల చక్కెర పరిమాణాలు కూడా తగ్గుముఖం పడతాయి.
క్యాన్సర్ నివారణ….
యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు డేట్స్ లో అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని నియంత్రించేందుకు బాగా సహాయపడుతుంది. అందుకే ఆహారం తిన్న వెంటనే ఐస్ క్రీమ్ లేదా స్వీట్ డిష్ బదులుగా ఒక ఖర్జూరం తినాలి. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు సులభంగా నయమవుతాయి.
Diabetes patient : మధుమేహాన్ని ఖర్జూరాలతో 10 రోజుల్లో నయం చేయవచ్చట.

హై బీపీని నియంతరిస్తుంది…
పొటాషియం డేట్స్ లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల రక్తపోటు సమస్యలు తలెత్తవు. గుండె జబ్బులు కూడా నయమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యతో బాధపడేవారు వీటిని రోజూ తప్పనిసరిగా తీసుకోవాలి.
ఎముకలు దృఢంగా తయారవుతాయి…
ఎముకలను బలంగా చేసే చాలా రకాల పోషకాలు ఖర్జూరాలలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. అయితే వీటిని ఎముకల సమస్యతో బాధపడుతున్న వారు తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి.