Viral News : అర్ధరాత్రి ఇంట్లోకి దూరిన దొంగల ముఠా…కుటుంబ సభ్యుల ముందే మహిళలపై…

Viral News : ఇటీవల హర్యానాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ దొంగల ముఠా కుటుంబ సభ్యుల కళ్ళముందే ముగ్గురు మహిళలపై సామూహిక హత్యాచారం చేసి వారింట్లోని నగదును మరియు బంగారాన్ని తీసుకొని పారిపోయారు. అయితే సంచలనం రేపుతున్న ఈ సంఘటన హర్యానాలోని పానిపట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇక సెప్టెంబర్ 21 రాత్రి జరిగిన ఈ ఘటన మట్లౌడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తుచేపట్టారు. అయితే అర్ధరాత్రి సమయంలో పదునైన కత్తులతో ఆయుధాలతో ఇంట్లోకి చొరబడిన దుండగులు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను తాళ్లతో బంధించారు. అనంతరం ఇంట్లోని మహిళలపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.

Advertisement

అలాగే ఈ ఘటన జరిగిన కాస్త దూరంలో మరో మహిళపై కూడా ఈ దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అయితే బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన ఈ దుండగులు బాధితురాలి భర్తను తాళ్లతో కట్టేసి ఆమెపై ,క్రూర మృగాళ్ల ప్రవర్తించడంతో తీవ్ర గాయాలకు గురైన బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. అయితే జరిగిన ఈ రెండు ఘటనలలో నిందితులు మాత్రం ఒకరెనని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇక ఈ రెండు ఘటనలు ఒకే ప్రాంతంలో జరగడంతో ప్రస్తుతం ఈ న్యూస్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక పోలీసులు సిసిటీవీ ఫోటేజ్ లను పరిశీలిస్తూ దుండగులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. దుండగుల ఆచూకీ కోసం ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Advertisement