CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సామరకోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొనడం జరిగింది. ఇక ఈ బహిరంగ సభ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో జగన్ మాట్లాడుతూ..చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ లపై జగన్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై సెటైర్ల్ వేశారు. మన కాపులు ప్రజలకి దత్తపుత్రుడు వంటి వ్యక్తిపై ప్రేమ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. చంద్రబాబు దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాదులో ఉందని ఇక ఆ దత్తపుత్రుడు ఇంట్లో ఇల్లాలు…మూడు నాలుగు ఏళ్లకు ఒకసారి మారుతుందని…
ఒకసారి లోకల్ మరొకసారి నేషనల్ మరొకసారి ఇంటర్నేషనల్ మహిళలు వారి ఇంటికి ఇల్లాలు అవుతారని జగన్ చెప్పుకోచ్చాడు. ఆడవాళ్ళ పట్ల దత్త పుత్రుడికి ఉన్న గౌరవం ఇది అంటూ వ్యాఖ్యానించారు. ప్యాకేజీ స్టార్ కి తాను పోటీ చేసి ఓడిపోయిన భీమవరం , గాజువాకతో సంబంధం అనుబంధం లేదు. ఈ విధంగా అభిమానుల ఓట్లను అమ్ముకోవడానికి దత్తపుత్రుడు అప్పుడప్పుడు వస్తాడంటూ సీఎం జగన్ చెప్పుకొచ్చారు. రెండు షూటింగ్స్ మధ్యలో వ్యాపారానికి దత్తపుత్రుడు వస్తాడని…సొంత వర్గాన్ని పార్టీని కాపాడుకోలేక అమ్ముకున్నాడని జగన్ విమర్శించారు. ఇక చంద్రబాబు ముఖం చూస్తే స్కామ్ లు జగన్ ని చూస్తే స్కీమ్ లు గుర్తుకు వస్తాయని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
ఇక ఈ తేడాని ప్రజలు గుర్తించాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును చూస్తేనే లంచాలు వెన్నుపోట్లు గుర్తుకు వస్తున్నాయని…గజదొంగల ముఠా అని జగన్ చెప్పుకొచ్చారు. అనంతరం జగన్ నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి జరిగినమంచి పనుల గురించి జగన్ ప్రజలకు అవగాహన కల్పించాడు. అలాగే మీకు మంచి జరిగింది అనిపిస్తేనే నాకు అండగా నిలబడండి అని ముఖ్యమంత్రి జగన్ కోరారు. దీంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్రం తో పాటు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.