Political : ప్రస్తుతం ఏపీలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు పీక్స్ కి వెళుతున్నాయి. ఒకరిపై ఒకరు మాటల దాడికి పాల్పడుతూ వార్తలలో నిలుస్తున్నారు. రీసెంట్ గా విజయసాయి రెడ్డి .. ఎన్టీఆర్ కూతురు ఉమా మహేశ్వరిని చంపింది అనేలా నారా లోకేష్పై విమర్శలు చేశారు. దానికి లోకేష్ కూడా ధీటుగా స్పందించారు. ఇలా ఈ వివాదం నడుస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఎంపీ రాసలీలల వీడియో బయటికి వచ్చింది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడిన వీడియో బయటికి రాగా, దీనిపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
ఆరోపణల వర్షం..ఎంపీ పదవికే కళంకం తెచ్చేలా ఎంపీ గోరంట్ల వ్యవహరించారని టీడీపీ మహిళా నేతలు విమర్శిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వైసీపీ ఎంపీ తీరు ఉందని మండిపడుతున్నారు. న్యూడ్ వీడియో లీక్ కావడంతో వెంటనే గోరంట్ల మాధవ్ పై సీఎం జగన్ యాక్షన్ తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ పదవికి ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గోరంట్ల మాధవ్పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆశ్లీల వీడియో వెనుక టీడీపీ నేతల కుట్ర ఉందని అన్నారు. మార్ఫింగ్ చేసి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని మాధవ్ ఆరోపించారు.
Political : నిజం అని నిరూపిస్తే తల నరుక్కోవడానికి సిద్దమన్న వైసీపీ ఎంపీ

ఈ వీడియో విషయమై ఎలాంటి విచారణకైనా తాను సిద్దమని ప్రకటించారు. ఈ విషయమై ఎస్పీకి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఎంపీ మాధవ్ వివరించారు. ఈ కుట్ర వెనుక టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణలున్నారని, ఈ ముగ్గురిపై పరువు నష్టం దావా వేస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. ఈ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి టెస్టుకు కూడా తాను సిద్దమేనన్నారు. మీకు ధైర్యంగా ఉంటే నేరుగా ఎదుర్కోవాలే తప్ప ఇలా వెనక గోతులు తవ్వడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అంటూ టీడీపీ నేతలపై మండిపడ్డారు. ఈ విషయమై ప్రెస్ కౌన్సిల్ ను కూడా ఆశ్రయిస్తానన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులలో కూడా పిల్ దాఖలు చేస్తానని కూడా ఎంపీ తెలిపారు. అందులో ఉన్నది నేను అని తేలితే తల నరుక్కోవడానికి కూడా సిద్దమేనంటూ చెప్పుకొచ్చారు.